News April 8, 2025
నర్వ: లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్

నర్వ మండలం లంకాల గ్రామంలోని రేషన్ దుకాణంలో సోమవారం సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. అనంతరం రేషన్ కార్డు లబ్ధిదారులు రాములమ్మ ఇంట్లో సన్న బియ్యంతో వండిన అన్నం భోజనం చేశారు. ఈ సంధర్బంగా రాములమ్మతో మాట్లాడారు. బియ్యం ఎలా వున్నాయని, అన్న ఎలా అయిందని అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
Similar News
News November 21, 2025
ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పవన్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. కేశనపల్లిలో కొబ్బరిచెట్లను ఆయన పరిశీలించనున్నారు. దీంతో పాటు 15గ్రామాల రైతులను పరామర్శించనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. అనంతరం ఆయన పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని పేర్కొన్నాయి. ఇటీవల మొంథా తుఫాను ప్రభావంతో కోనసీమలోని కొబ్బరి రైతులు నష్టపోయిన విషయం తెలిసిందే.
News November 21, 2025
మల్దకల్: ఈనెల 25 నుంచి తిమ్మప్ప బ్రహ్మోత్సవాలు

మల్దకల్ మండల కేంద్రంలోని ఆదిశిలా క్షేత్రంలో కొలువైన తిమ్మప్ప స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 25 నుంచి డిసెంబర్ 9 వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా డిసెంబర్ 2న స్వామి కళ్యాణం, 3న తెప్పోత్సవం, 4న రాత్రి 11:00 గంటలకు రథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్ ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. నడిగడ్డ తిరుపతిగా పేరుగాంచిన తిమ్మప్ప స్వామి ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
News November 21, 2025
వేములవాడ టెంపుల్ రెనోవేషన్.. రంగంలోకి బాహుబలి క్రేన్

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనుల కోసం అతిపెద్దదైన క్రేన్ను అధికారులు రంగంలోకి దించారు. ఆలయ దక్షిణ ప్రాకారం కూల్చివేత పనులు కొనసాగిస్తున్న క్రమంలో ప్రత్యేకంగా రప్పించిన బాహుబలి క్రేన్తో పనులు ప్రారంభించారు. రూ.150 కోట్లతో చేపట్టిన ఆలయ అభివృద్ధి పనుల కోసం హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి తెప్పించిన అధునాతనమైన, అతిపెద్ద క్రేన్లు, డ్రిల్లింగ్ యంత్రాలను స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.


