News August 29, 2024

నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ మొదటి అడ్మిషన్

image

నర్సంపేట పట్టణంలో ఈ ఏడాది ప్రారంభమైన ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి అడ్మిషన్‌ను రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన శుభోధ్ శర్మ తీసుకున్నారు. కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థికి జాయినింగ్ లెటర్‌ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ గురువారం అందజేశారు. ఎంబీబీఎస్‌లో 50 సీట్లతో ఈ ఏడాది తరగతులను నిర్వహించనున్నారు. విభాగాధిపతులు పరశురాం, గిరిధర్, దామోదరి, శ్రీదేవి, కేశవ్, తదితరులున్నారు.

Similar News

News December 8, 2025

ఎన్నికల ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల మొదటి విడత ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. ఈ నెల 11న వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాల్లో జరగనున్న పోలింగ్–కౌంటింగ్ ఏర్పాట్లపై ఆమె సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, శానిటేషన్, తాగునీరు, ర్యాంపులు, విద్యుత్ వంటి వసతులు సిద్ధం చేయాలని ఆదేశించారు.

News December 7, 2025

WGL: పంచాయతీ ఎన్నికల సమాచారం లోపం.. మీడియాకు ఇబ్బందులు!

image

జిల్లాలో GP ఎన్నికల వివరాలు పత్రికలు, మీడియాకు చేరవేయడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలైనా, అర్ధరాత్రి వివరాలు ఇస్తామని DPO చెప్పగా, సమాచార శాఖ పాత డేటానే పంపడంతో తాజా సమాచారం మాయం అయింది. గతంలో 50 మండలాల డేటాను సమయానికి అందించిన యంత్రాంగం, ఇప్పుడు 11 మండలాల వివరాలకే తంటాలు పడుతోంది. వాట్సాప్‌కే పరిమితమైన సమాచార పంపిణీతో ఇబ్బందవుతోంది.

News December 7, 2025

మూడు విడతలు పూర్తయ్యే వరకు కోడ్ అమలు: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలు ముగిసే వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని గఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నందున, చివరి దశ పూర్తయ్యే వరకు కోడ్ కొనసాగుతుందన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు కూడా కోడ్ వర్తిస్తుందని, ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.