News August 29, 2024

నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ మొదటి అడ్మిషన్

image

నర్సంపేట పట్టణంలో ఈ ఏడాది ప్రారంభమైన ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి అడ్మిషన్‌ను రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన శుభోధ్ శర్మ తీసుకున్నారు. కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థికి జాయినింగ్ లెటర్‌ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ గురువారం అందజేశారు. ఎంబీబీఎస్‌లో 50 సీట్లతో ఈ ఏడాది తరగతులను నిర్వహించనున్నారు. విభాగాధిపతులు పరశురాం, గిరిధర్, దామోదరి, శ్రీదేవి, కేశవ్, తదితరులున్నారు.

Similar News

News December 1, 2025

ఎయిడ్స్‌పై అవగాహన అత్యంత అవసరం: కలెక్టర్

image

వరల్డ్ ఎయిడ్స్ డే-2025 సందర్భంగా వరంగల్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎయిడ్స్‌పై సమాజంలో విస్తృత అవగాహన అవసరమని, ముందస్తు జాగ్రత్తలు, సరైన సమాచారంతోనే వ్యాధిని నిరోధించగలమని పేర్కొన్నారు.

News December 1, 2025

వరంగల్‌: హెచ్ఐవీ కేసులు ఆందోళనకరం!

image

జిల్లాలో ఇప్పటి వరకు 5,464 మంది హెచ్ఐవీ బాధితులు నమోదు కాగా, వీరిలో 4,558 మందికి ప్రభుత్వం ప్రతి నెల ఉచిత మందులు అందిస్తోంది. 863 మంది బాధితులకు ఏఆర్జే ద్వారా నెలకు రూ.2,016 పెన్షన్ ఇస్తున్నారు. నెలకు సగటున 36 కొత్త హెచ్ఐవీ కేసులు వెలుగులోకి వస్తుండటం, గర్భిణులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో హై రిస్క్ వ్యక్తులు 3,498 మంది ఉన్నారు.
#నేడు ప్రపంచ ఎయిడ్స్ డే.

News November 30, 2025

రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రేపు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ ఉండదని స్పష్టంచేశారు. జిల్లాలోని ప్రజలు ఈ నిర్ణయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.