News March 25, 2025

నర్సంపేట: యాక్సిడెంట్.. బీటెక్ విద్యార్థి మృతి

image

వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. జయముఖి కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న దారం వికాస్(22), మరో విద్యార్థి రాజు బైక్‌పై పాకాల నుంచి నర్సంపేటకు వస్తున్నారు. రాజుపేట శివారులో ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈ ఘటనలో వికాస్ అక్కడికక్కడే మృతి చెందగా.. రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. జనగామ జిల్లా చిల్పూర్ వికాస్ స్వస్థలం.

Similar News

News November 21, 2025

నిర్మల్ జిల్లాలో దారుణం

image

జిల్లాలోని సారంగాపూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మల్‌లోని ఓ ప్రవైటు ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన మృతి చెందింది. చించోలి(బి) గ్రామానికి చెందిన ఓ మహిళ శుక్రవారం మగబిడ్డను ప్రసవించింది. శిశువును శుభ్రం చేస్తుండగా కబోర్డు మీదపడి శిశువు అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఆసుపత్రి నిర్వహకులు ఆ కుటుంబానికి నగదు చెల్లించి సర్దుబాటు చేసుకున్నారని స్థానికులు తెలిపారు.

News November 21, 2025

బాధ్యతలు స్వీకరించిన పార్వతీపురం జిల్లా అదనపు ఎస్పీ

image

పార్వతీపురం మన్యం జిల్లా నూతన అదనపు ఎస్పీగా ఎం. వెంకటేశ్వరరావు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా నూతన అదనపు ఎస్పీగా ఎం.వేంకటేశ్వర రావు నియమితులయ్యారు. ఈయన జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో శాంతి భద్రతల కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు.

News November 21, 2025

ఓటర్ల జాబితా నిరంతర ప్రక్రియ: కలెక్టర్

image

ఓటర్ల జాబితా నవీకరణ పారదర్శకంగా నిరంతరంగా కొనసాగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 2002 నుంచి 2005 మధ్యలో నమోదైన ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ కూడా చేపట్టినట్లు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న ఫారం 6లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.