News March 25, 2025
నర్సంపేట: యాక్సిడెంట్.. బీటెక్ విద్యార్థి మృతి

వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. జయముఖి కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న దారం వికాస్(22), మరో విద్యార్థి రాజు బైక్పై పాకాల నుంచి నర్సంపేటకు వస్తున్నారు. రాజుపేట శివారులో ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈ ఘటనలో వికాస్ అక్కడికక్కడే మృతి చెందగా.. రాజుకు తీవ్ర గాయాలయ్యాయి. జనగామ జిల్లా చిల్పూర్ వికాస్ స్వస్థలం.
Similar News
News November 18, 2025
HYD: ట్రైన్ డోర్ వద్ద కూర్చుంటున్నారా.. జాగ్రత్త!

రైలు ప్రయాణంలో డోర్ వద్ద కూర్చుని వెళ్తున్నారా?..అయితే అప్రమత్తంగా ఉండాలని రైల్వే పోలీసులు సూచిస్తున్నారు. డోర్ వద్ద కూర్చుని ఓ వ్యక్తి మొబైల్ ఆపరేట్ చేస్తుండగా సికింద్రాబాద్ దాటిన తర్వాత ఓ దొంగ ఒక్కసారిగా అతని మొబైల్ గుంజుకొన్నాడు. ట్రైన్ రన్నింగ్లో ఉండటంతో బాధితుడు ఏం చేయలేకపోయాడు. ఇకనైనా డోర్ వద్ద కూర్చోవద్దని, ఇటువంటి ప్రయాణం సురక్షితం కూడా కాదని రైల్వే పోలీసులు సూచించారు.
SHARE IT
News November 18, 2025
బాబా శతజయంతి భద్రత ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లా మంత్రులు సోమవారం సమీక్ష నిర్వహించారు. 19న ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, ఇతర ప్రముఖులు జిల్లాకు రానున్న సందర్భంగా.. సోమవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా మంత్రి సవిత జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించారు. వీఐపీలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నిర్వహించాలన్నారు.
News November 18, 2025
నిషేధిత ఔషధాలు విక్రయిస్తే చర్యలు: డ్రగ్ ఇన్స్పెక్టర్

నిషేధిత ఔషధాలను విక్రయించవద్దని, ఔషధాల రికార్డులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ చంద్రకళ మెడికల్ షాపు యజమానులను ఆదేశించారు. రామాయంపేటలో సోమవారం నాలుగు ఔషధ దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. జీఎస్టీ స్లాబ్ రేట్ ప్రకారం ఔషధాలు విక్రయించాలని సూచించారు. డాక్టర్ మందుల చీటీ లేకుండా ఔషధాలు విక్రయించవద్దని, నిషేధిత ఔషధాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


