News August 3, 2024

నర్సంపేట: 256 కిలోల గంజాయి పట్టివేత

image

అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను టాస్క్‌ఫోర్స్, నర్సంపేట పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ డొంకరాయి నుంచి 256 కిలోల గంజాయిని 128 ప్యాకెట్లలో నింపి కారులో తరలిస్తుండగా నర్సంపేటలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.64 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. బాబు, కుమారస్వామి, ఎన్.కుమారస్వామిలను అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Similar News

News November 27, 2025

Te-Poll యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: వరంగల్ కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు పూర్తి సమాచారాన్ని వేగంగా, సులభంగా అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్‌ ఇప్పుడు గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డా.సత్యశారద తెలిపారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం వివరాలు, ఓటర్ స్లిప్ నమోదు స్థితి వంటి కీలక సమాచారాన్ని ఒకే యాప్ ద్వారా తెలుసుకునే విధంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన యాప్ ఇది అని పేర్కొన్నారు.

News November 27, 2025

వరంగల్: పంచాయతీ ఎన్నికలు.. కలెక్టర్ సమీక్ష

image

వరంగల్ జిల్లా పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను మరింత పటిష్ఠంగా సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించిన రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషనర్, జిల్లా పరిశీలకురాలు బి.బాల మాయదేవి (IAS) వరంగల్ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పూలమొక్క అందించి ఆమెకు ఘన స్వాగతం పలికారు. తర్వాత కలెక్టరేట్ ఛాంబర్‌లో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

News November 27, 2025

వరంగల్: పంచాయతీ ఎన్నికలు.. కలెక్టర్ సమీక్ష

image

వరంగల్ జిల్లా పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను మరింత పటిష్ఠంగా సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించిన రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషనర్, జిల్లా పరిశీలకురాలు బి.బాల మాయదేవి (IAS) వరంగల్ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పూలమొక్క అందించి ఆమెకు ఘన స్వాగతం పలికారు. తర్వాత కలెక్టరేట్ ఛాంబర్‌లో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.