News January 18, 2025
నర్సన్న నిత్య ఆదాయం రూ.35,63,82

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం 1260 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా కళ్యాణ కట్ట ద్వారా రూ.63,000, ప్రసాద విక్రయాలు రూ.11,51,690, VIP దర్శనాలు రూ.3,75,000, బ్రేక్ దర్శనాలు రూ.1,80,300, కార్ పార్కింగ్ రూ.4,50,000, వ్రతాలు రూ.80,800, సువర్ణ పుష్పార్చన రూ.79,432, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.35,63,824 ఆదాయం వచ్చినట్లు ఆలయ EO భాస్కరరావు తెలిపారు.
Similar News
News February 12, 2025
నల్గొండ: రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జు అయిన తల

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. వివరాలిలా.. సూర్యాపేట మండలానికి చెందిన మల్లమ్మ ఆటో చెట్టుకి ఢీకొనడంతో మృతిచెందింది. HYDకి చెందిన ఇస్లాం WGL వెళ్తున్న క్రమంలో బైక్ను కారు ఢీకొట్టడంతో మరణించాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తల నుజ్జునుజ్జు అయి మహిళ మృతి చెందింది. ఈఘటన అడ్డగూడురులో జరిగింది. ఆమె దాచారం ZPHS పాఠశాల టీచర్ జబీన్గా పోలీసులు గుర్తించారు.
News February 12, 2025
ఈతకు వచ్చి మునుగోడు యువకుడి మృతి

నల్గొండ మండలం నర్సింగ్ భట్లలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వచ్చి మునుగోడు మండలం గూడపూర్కు చెందిన వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడపూర్కు చెందిన వ్యక్తి నర్సింగ్ భట్లలోని AMRP కాలువలోకి ఈతకు వచ్చి నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు.
News February 12, 2025
నేడు నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి

నేడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి NLG జిల్లాకు రానున్నారు. ఉదయం 7:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 9:30 గంటలకు నార్కెట్ పల్లి మండలం గోపలాయిపల్లి గ్రామంలోని శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు. అనంతరం తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన రాజిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించనున్నారు.