News September 8, 2024
నర్సరావుపేట: సాంకేతిక సేవలు అందించేందుకు దరఖాస్తు చేసుకోండి

వరద సహాయక చర్యల్లో భాగంగా సాంకేతిక సేవలు అందించేందుకు పల్నాడు జిల్లాలోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు కోరారు. మాట్లాడుతూ వరద బాధితుల ఇళ్లల్లో ప్లంబర్, ఎలక్ట్రీషియన్ తదితర సేవలందించేందుకు ఏపీఎస్ ఎస్డిసి యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలోనిఆసక్తి గల అభ్యర్థులు 9988853335, 871265 5686, 87901 17279, 87901 18349 సంప్రదించాలన్నారు.
Similar News
News October 20, 2025
వైద్య కళాశాలల ప్రైవేటీకరణతో పేదలకు నష్టం: అంబటి

వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడంతో పేదలకు ఎంతగానో నష్టం చేకూరుతుందని పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. ఆదివారం పెదకాకానిలో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రైవేటీకరణ చేయడం వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు. ప్రజలందరూ పీపీపీ విధానాన్ని ఖండించాలని చెప్పారు. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్మించాలన్నారు.
News October 19, 2025
యాప్ల సంఖ్య తగ్గించాం: DEO రేణుక

ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విలువైన బోధన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని పూర్వం అమల్లో ఉన్న యాప్లను తగ్గించి కనిష్ఠ సంఖ్యకు తీసుకొచ్చినట్లు డీఈవో సి.వి. రేణుక తెలిపారు. అసెస్మెంట్ పుస్తకాల విషయంలో ఉపాధ్యాయుల అభ్యంతరాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజన పథక వివరాలు అందించడానికి ప్రధానోపాధ్యాయుల విధులలో భాగమని అన్నారు.
News October 19, 2025
GNT: ‘గేట్’ కమిటీ సభ్యులు మన కొత్త కోటేశ్వరరావు

కొత్త కోటేశ్వరరావు (1929, అక్టోబర్ 19-2021 నవంబర్ 29) తెనాలి సమీపంలోని సంగం జాగర్లమూడిలో జన్మించారు. 1966లో యూనివర్సిటీ ఆఫ్ అయోవా నుంచి డాక్టరల్ డిగ్రీని కూడా పొందారు. వరంగల్ ప్రాంతీయ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేశారు. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యునిగా ఆయన పనిచేశారు.