News September 8, 2024
నర్సరావుపేట: సాంకేతిక సేవలు అందించేందుకు దరఖాస్తు చేసుకోండి

వరద సహాయక చర్యల్లో భాగంగా సాంకేతిక సేవలు అందించేందుకు పల్నాడు జిల్లాలోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు కోరారు. మాట్లాడుతూ వరద బాధితుల ఇళ్లల్లో ప్లంబర్, ఎలక్ట్రీషియన్ తదితర సేవలందించేందుకు ఏపీఎస్ ఎస్డిసి యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలోనిఆసక్తి గల అభ్యర్థులు 9988853335, 871265 5686, 87901 17279, 87901 18349 సంప్రదించాలన్నారు.
Similar News
News July 11, 2025
గుంటూరు: రైస్ కార్డులకు దరఖాస్తుల వెల్లువ

రైస్ కార్డుల కోసం గుంటూరు జిల్లాలో 52,447 దరఖాస్తులు అందగా, వీటిలో 90% సమస్యలు పరిష్కారం అయ్యాయి. కొత్తగా 8 వేలకుపైగా కార్డులు మంజూరు అయ్యే అవకాశం ఉంది. అత్యధికంగా పేర్ల చేర్పు దరఖాస్తులే రావడం గమనార్హం. తెనాలి, గుంటూరు డివిజన్లలో అధిక స్పందన కనిపించింది. పేర్ల తొలగింపు, చిరునామా మార్పు, కార్డు విభజనలపై కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇంకా 4,300లకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
News July 11, 2025
GNT: చంద్రబాబు, లోకేశ్పై అంబటి ట్వీట్

వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్కి చురకలంటించారు. ‘తల్లికి వందనం’ లోకేశ్ ఆలోచన. ‘ఉచిత విద్యుత్’ బాబు ఆలోచన అని చెప్తూ అమాయకపు ప్రజల్లారా నమ్మండి.!’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా అంబటి మెసేజ్పై టీడీపీ, వైసీపీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పరస్పరం మాటల యుద్దం జరుగుతుంది.
News July 11, 2025
GNT: రాష్ట్రీయ బాల పురస్కార్కు ప్రతిభావంతులకు అవకాశం

విభిన్న ప్రతిభను ప్రోత్సహించేందుకు గుంటూరు జిల్లాలోని 18ఏళ్ల లోపు విద్యార్థుల నుంచి రాష్ట్రీయ బాల పురస్కార్కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కళలు, క్రీడలు, పర్యావరణం, సామాజిక సేవ, తదితర రంగాల్లో సామర్థ్యం చూపిన పిల్లలు జులై 31లోగా https://awards.gov.inలో అప్లై చేయాలని జిల్లా శిశు సంక్షేమ అధికారి ప్రసూన తెలిపారు. కేంద్రం నిర్వహించే ఈ అవార్డు ప్రతిభకు గుర్తింపు కల్పించనుందన్నారు.