News March 27, 2025
నర్సాపూర్(జి): రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి: SI

నర్సాపూర్ మండలంలోని తురాటీ గ్రామ బస్టాప్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఎస్సై సాయికిరణ్ వివరాల ప్రకారం.. తురాటీ గ్రామానికి చెందిన బొడికరి లక్ష్మి – నారాయణ దంపతులు బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు బైక్పై వేగంగా వెళ్తూ దంపతులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో లక్ష్మి మృతి చెందగా నారాయణకు గాయాలయ్యాయని ఎస్సై తెలిపారు.
Similar News
News December 4, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా..

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.1903, కనిష్ఠ ధర రూ.1750; వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2052, కనిష్ఠ ధర రూ.2005; వరి ధాన్యం (BPT) ధర రూ.2100; వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.3014, కనిష్ఠ ధర రూ.2651గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.
News December 4, 2025
మార్స్పై టైమ్ 477 మైక్రోసెకండ్ల ఫాస్ట్.. ఎందుకంటే?

మైక్రోసెకండ్ అంటే సెకనులో మిలియన్ వంతు. మనకు ఇది లెక్కలోకి రాని వ్యవధి. కానీ సోలార్ సిస్టమ్లో కచ్చితమైన నావిగేషన్, కమ్యూనికేషన్ వ్యవస్థలను ప్లాన్ చేస్తున్న స్పేస్ ఏజెన్సీలకు ఇది చాలా ముఖ్యం. భూమితో పోల్చితే అంగారకుడిపై గడియారం 477 మైక్రోసెకండ్లు వేగంగా వెళ్తుందని సైంటిస్టులు గుర్తించారు. ఐన్స్టీన్ జనరల్ రిలేటివిటీ థియరీ ప్రకారం బలహీనమైన గురుత్వాకర్షణ, ఆర్బిటల్ ఫ్యాక్టర్స్ దీనికి కారణమన్నారు.
News December 4, 2025
వాస్తును నమ్మవచ్చా?

వాస్తుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు దీన్ని నిజమని నమ్ముతారు. మరికొందరు మూఢనమ్మకమని అభిప్రాయపడతారు. అయితే వాస్తు అనేది ఓ శాస్త్రమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘ఇది కేవలం ఓ నమ్మకం కాదు. జీవన మనుగడకు అవసరమైన పంచభూతాలను ఈ శాస్త్రం సమన్వయం చేస్తుంది. నివాసయోగ్యత కోసం మనం నివసించే ప్రదేశాలలో ఈ పంచభూతాల సమతుల్యత కోసం వాస్తును పాటించాలి’ అని అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


