News September 21, 2024

నర్సాపూర్: ‘జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

image

జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు రాజీ చేయదగ్గ కేసులను రాజీ కుదురు కుదుర్చుకోవచ్చని నర్సాపూర్ న్యాయమూర్తి కే అనిత సూచించారు. నర్సాపూర్ కోర్టు ఆవరణలో శుక్రవారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి పోలీస్ అధికారులు హాజరయ్యారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో కక్షిదారీలు రాజి కుదుర్చుకునేలా అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News September 21, 2024

నర్సాపూర్: డిపో సరే.. డ్రైవర్లు ఎక్కడా?

image

నర్సాపూర్‌లో ఆర్టీసి డిపో ఏర్పాటు కావడంతో ఇక తమ ప్రయాణ కష్టాలు తీరుతాయని ఈ ప్రాంత వాసులు ఆశించారు. అయితే ప్రయాణికుల అవసరాలకు తగినట్లు బస్సులు నడపకపోవడంతో అధికారులు విఫలమవుతున్నారు. డిపోలో ఉన్నా బస్సులకు అనుగుణంగా మొత్తం 45 మంది డ్రైవర్లకు 36 మంది ఉన్నారు. దీంతో సరైన రూట్లో బస్సులు నడువక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News September 21, 2024

కొండా లక్ష్మణ్‌బాపూజీ తెలంగాణకు నిత్యస్ఫూర్తి: కేసీఆర్

image

తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం తన జీవితకాలం పోరాడిన తొలితరం నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని, ఆయన తెలంగాణకు నిత్యస్ఫూర్తి అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన బాపూజీ స్ఫూర్తి తాను సాగించిన చివరిదశ తెలంగాణ సాధన పోరాటంలో ఇమిడి ఉన్నదని తెలిపారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని వారి కృషిని కేసీఆర్‌ స్మరించుకున్నారు.

News September 21, 2024

బెజ్జంకి: కుటుంబ కలహాలో తల్లీ, కూతురు ఆత్మహత్య

image

సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో తీవ్ర విషాదం నెలకొంది. ఓ తల్లి తన కూతురితో సహా సూసైడ్ చేసుకుంది. స్థానికుల సమాచారం.. జనగాం జిల్లాకు చెందిన రాజు జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి బెజ్జంకి మండలానికి వలస వచ్చి కూలీ పనులు చేస్తున్నారు. రాజు మద్యానికి బానిసై తరుచుగా భార్య శారద, పిల్లలతో గొడవ పడేవాడు. గురువారం అర్ధరాత్రి సైతం గొడవ పడగా మనస్తాపానికి గురై శారద కుమార్తెతో సాహ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.