News March 9, 2025
నర్సాపూర్ (జి): అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

గొల్లమడ గ్రామ శివారులోని నీరటి బుద్దేశ్వర్ వ్యవసాయ భూమికి దగ్గరలోని అడవిలో వేప చెట్టుకు గొల్లమడ గ్రామానికి చెందిన నీరటి గంగాధర్(44) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ భరించలేక ఉరేసుకొని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతని భార్య నీరటి సవిత నర్సాపూర్ జి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా హెడ్ కానిస్టేబుల్ ఎండీ జలాలుద్దీన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Similar News
News February 9, 2026
BREAKING: మళ్లీ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,240 పెరిగి రూ.1,58,840కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,050 ఎగసి రూ.1,45,600 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ ధర ఏకంగా రూ.15,000 పెరిగి రూ.3 లక్షలకు చేరింది.
News February 9, 2026
KNR: ఎన్నికల నిఘా ‘ముమ్మరం’.. సరిహద్దుల్లో తనిఖీలు!

ప్రలోభాలను అరికట్టేందుకు ఎన్నికల అధికారులు, పోలీసులు నిఘాను ముమ్మరం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం గస్తీ కాస్తున్నాయి. జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాల తనిఖీని కఠినతరం చేశారు. ఇప్పటికే ఫిబ్రవరి 28 వరకు జిల్లాలోపోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ తెలిపారు.
News February 9, 2026
బలమైన బంధం కోసం రోజూ శృంగారం: సైంటిస్టులు

బలమైన సంబంధాల కోసం భార్యాభర్తలు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. భాగస్వాములు సన్నిహితంగా ఉన్న రోజుల్లో వారిలో ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. కానీ ఇది 24 గంటల వరకేనని సూచిస్తున్నారు. అయితే రిలేషన్లో సమస్యలను తగ్గించుకునేందుకు జరిపే శృంగారం వల్ల తర్వాతి రోజు ఒత్తిడి పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. 319 జంటలపై చేసిన ఈ స్టడీ Archives of Sexual Behaviorలో ప్రచురితమైంది.


