News January 23, 2025

నర్సాపూర్ (జి): బస్సును ఢీ కొట్టిన లారీ

image

నిర్మల్ నుంచి భైంసా వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సును నసీరాబాద్ గ్రామ శివారులో అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు స్వల్పంగా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న దిలావర్పూర్‌కు చెందిన నర్సమ్మకు గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ కిషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయికిరణ్ వెల్లడించారు.

Similar News

News November 6, 2025

సత్యసాయి బాబా సూక్తులు

image

● నీకు హాని చేసిన వారిని కూడా నువ్వు క్షమించాలి
● పరస్పర ప్రేమను అలవర్చుకోండి. ఎప్పుడూ ఆనందంగా, ముఖంపై మధురమైన చిరునవ్వుతో ఉండండి
● ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా మాట్లాడకు
● ఎలాంటి కష్టాలు వచ్చినా భగవంతుడిపై విశ్వాసం కోల్పోకూడదు, విశ్వాసం ఉంటే ఎంతైనా సాధించొచ్చు.

News November 6, 2025

NZB: మహిళ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్

image

నవీపేట్(M) ఫతేనగర్ శివారులో అక్టోబర్ 24న జరిగిన <<18089668>>మహిళ హత్య<<>> కేసులో ముగ్గురిని బుధవారం అరెస్ట్ చేసినట్లు NZB ACP రాజావెంకట్ రెడ్డి తెలిపారు. ఫకీరాబాద్, కోస్గీ, మద్దేపల్లికి చెందిన సంగీత, మంగలి బాబు, పద్మ.. మృతురాలు శ్యామల లక్ష్మీ @ బుజ్జిని ఫతేనగర్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతునులిమి చంపేశారు. ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. డబ్బుల కోసం వారి మధ్య గొడవ జరిగిందని ACP వెల్లడించారు.

News November 6, 2025

SRP: డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు శిబిరాలు

image

సింగరేణిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు నవంబర్‌లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. ఈ నెల 12, 13 తేదీల్లో శ్రీరాంపూర్, 17, 18 తేదీల్లో మందమర్రి, 24, 25 తేదీల్లో బెల్లంపల్లి, గోలేటి ఏరియాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ అవకాశాన్ని సీఎంపీఎస్, సీపీఆర్ఎంఎస్ లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.