News January 23, 2025

నర్సాపూర్ (జి): బస్సును ఢీ కొట్టిన లారీ

image

నిర్మల్ నుంచి భైంసా వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సును నసీరాబాద్ గ్రామ శివారులో అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు స్వల్పంగా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న దిలావర్పూర్‌కు చెందిన నర్సమ్మకు గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ కిషన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయికిరణ్ వెల్లడించారు.

Similar News

News October 15, 2025

MNCL: ఈ నెల 18న కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల భర్తీ

image

తెలంగాణ వైద్య విధాన పరిషత్, జిల్లా ఆసుపత్రుల ప్రధాన అధికారి కార్యాలయ పరిధిలోని ఆసుపత్రులలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేసేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఆసుపత్రుల పర్యవేక్షకుడు డా.కోటేశ్వర్ తెలిపారు. 8 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, 1 పల్మనరి మెడిసిన్, 2 పీడియాట్రిక్ పోస్టులు ఉన్నాయన్నారు. అభ్యర్థులు ఈ నెల 18న ఉదయం 10:30కు జిల్లా కార్యాలయంలో సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలన్నారు.

News October 15, 2025

GDP గ్రోత్‌లో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా భారత్

image

ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్(IMF) 2025కు గాను ఇండియా GDP గ్రోత్‌ను రివైజ్ చేసింది. ఈ ఏడాదికి 6.4% గ్రోత్ ఉంటుందని పేర్కొన్న IMF దానిని 6.6%కు పెంచింది. 2026లో అది 6.2% ఉంటుందని అంచనా వేసింది. ఎమర్జింగ్ మార్కెట్, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఇదే అత్యధికం. గ్లోబల్ గ్రోత్ ఈ ఏడాది 3.2% కాగా, వచ్చే ఏడాది 3.1%కు తగ్గొచ్చంది. US గ్రోత్ ఈ ఏడాది 2.0% ఉండగా 2026లో 2.1%కు పెరగొచ్చని తెలిపింది.

News October 15, 2025

కొండా సురేఖ, పొంగులేటి మధ్య విభేదాలకు ఆయనే కారణమా?

image

మంత్రి కొండా సురేఖ OSD సుమంత్‌ను పీసీబీ టర్మినేట్ చేయగా.. దేవాదాయ, అటవీశాఖ విభాగాల పరిపాలనలో తన స్థానాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. మేడారం అభివృద్ధికి కాంటాక్ట్ పనులను అప్పగించడంలో సురేఖ, మంత్రి పొంగులేటి మధ్య విభేదాలు సృష్టించడంలో సుమంత్ పాత్ర ఉందనీ అనుమానం వ్యక్తంచేశారు. కాగా, DEC 2023లో OSDగా నియమితులైన సుమంత్ కాంట్రాక్టును 2025 చివరివరకు పొడిగించగా తాజాగా<<18008160>> వేటుపడింది<<>>.