News February 1, 2025

నర్సాపూర్ (జి): మద్యం మత్తులో ఉరేసుకున్నాడు..!

image

నర్సాపూర్ (జి) మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఉరేసుకొని మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై సాయికిరణ్ తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రానికి చెందిన కోడె ప్రభాకర్(40) భార్య 4 ఏళ్ల క్రితం మృతి చెందింది. దీంతో అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది శుక్రవారం మద్యం మత్తులో ఇంట్లో దూలానికి ఉరేసుకొని మృతి చెందాడన్నారు.

Similar News

News December 4, 2025

పెద్దపల్లి: ట్రాక్టర్‌ను ఢీకొని వ్యక్తి మృతి

image

PDPL(D) ధర్మారం మండలం నాయికంపల్లి తండాకు చెందిన నవనందుల రాజేశ్(36) గోదావరి స్నానం చేసి బైక్‌పై ఇంటికి వస్తుండగా పత్తిపాక డాంబర్ ప్లాంట్ వద్ద నిలిపి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనతో పాటు ఉన్న అరవెండి కిష్టయ్య(45), మంగారపు సాయికుమార్‌(30)కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108లో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. CI ప్రవీణ్‌ కుమార్, SI ప్రవీణ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

News December 4, 2025

VJA: భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు నజరానా

image

భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రోత్సాహకంగా భారీ నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో జట్టుకు రూ.10 లక్షల చెక్కును కెప్టెన్ దీపికకు అందజేశారు. ఫైనల్‌లో కీలక పాత్ర పోషించిన పొంగి కరుణా కుమారికి రూ. 5 లక్షలు, జట్టు కోచ్ అజేయ్ కుమార్ రెడ్డికి రూ.1 లక్షను ఏసీఏ ప్రదానం చేసింది.

News December 4, 2025

ఖమ్మం నేతల ప్రస్థానం.. సర్పంచ్‌ నుంచే రాష్ట్ర రాజకీయాలకు!

image

నేటి రాజకీయాల్లో సర్పంచ్‌ పదవి అత్యంత కీలకమనడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా చరిత్రే దీనికి నిదర్శనం. రాంరెడ్డి వెంకటరెడ్డి, వనమా వెంకటేశ్వరరావు వంటి సీనియర్‌ నేతలు మొదట సర్పంచ్‌లుగా గెలిచి, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఎదిగారు. అలాగే, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, కొండబాల కోటేశ్వరరావు, సున్నం రాజయ్య సైతం సర్పంచ్‌ నుంచే ఎమ్మెల్యేలుగా గెలుపొందడం ఈ పదవి ప్రాధాన్యతను తెలియజేస్తోంది.