News February 24, 2025
నర్సాపూర్ (జి): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

నర్సాపూర్ (జి)గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. భైంసా పట్టణానికి చెందిన సంతోష్, గౌతమ్ అనే ఇద్దరు యువకులు బైక్ పై నిర్మల్లో పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా నర్సాపూర్ గ్రామ శివారులో బైకును గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో సంతోష్, గౌతమ్కు తీవ్ర గాయాలు కాగా ఆదివారం సంతోష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయి కిరణ్ తెలిపారు.
Similar News
News December 9, 2025
పిట్లం: ఎన్నికల విధులకు సిద్ధంకండి: సబ్ కలెక్టర్

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా, పిట్లంలో మంగళవారం ఎన్నికల సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి హాజరయ్యారు. ఆమె సిబ్బందికి ఎన్నికల నియమాలు, ఓటింగ్ ప్రక్రియ, ఓట్ల లెక్కింపుపై స్పష్టమైన ఆదేశాలు, సలహాలు ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆమె సిబ్బందికి సూచించారు.
News December 9, 2025
పిల్లలు మొండిగా చేస్తున్నారా?

కొందరు పిల్లలు ఊరికే అలుగుతుంటే వారిని తిట్టడం లేదా చేయి చేసుకోవడం వల్ల వారు మరింత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల సాధ్యమై నంత వరకు వారిని బుజ్జిగిస్తూ, దారిలోకి రాకపోతే చిన్నగా బెదిరించాలి. కానీ చేయి చేసుకోవడం, తిట్టడం వల్ల మాట వినరంటున్నారు నిపుణులు. వారిని ప్రేమతో పెంచాలి. ఇంట్లో ప్రతికూల వాతావరణం లేకుండా చూసుకోవాలి. అప్పుడే పిల్లలు మొండితనం వీడతారని చెబుతున్నారు.
News December 9, 2025
విద్యార్థుల గళంపై కూటమి ఉక్కుపాదం మోపుతుంది: YCP

విద్యార్థుల గళంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని YCP ‘X’లో పోస్ట్ చేసింది. YCP స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని నిరసన తెలిపినందుకు చైతన్యపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారని రాసుకొచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అడిగితే కేసులా చంద్రబాబు, లోకేశ్ అంటూ ప్రశ్నించారు.


