News February 24, 2025
నర్సాపూర్ (జి): రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

నర్సాపూర్ (జి)గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. భైంసా పట్టణానికి చెందిన సంతోష్, గౌతమ్ అనే ఇద్దరు యువకులు బైక్ పై నిర్మల్లో పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా నర్సాపూర్ గ్రామ శివారులో బైకును గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో సంతోష్, గౌతమ్కు తీవ్ర గాయాలు కాగా ఆదివారం సంతోష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయి కిరణ్ తెలిపారు.
Similar News
News September 19, 2025
టీడీపీలోకి మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్

AP: మాజీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు చిలకలూరిపేటకు చెందిన పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. మాజీ మంత్రి విడదల రజినితో విభేదాల కారణంగా ఇప్పటికే ఆయన వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. గతంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజశేఖర్ వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్గానూ పనిచేశారు.
News September 19, 2025
HYD: ఇరిగేషన్ అనుమతులు ఇంకెప్పుడు?

HYD శివారు ప్రతాపసింగారంలో రైతులు 131 ఎకరాలు LPS కింద ప్రభుత్వానికి ఇచ్చారు. ఇందులో HMDA లేఅవుట్ వేసి రైతులకు- HMDAకు 60:40 నిష్పత్తిలో పంపిణీ చేయనుంది. అయితే భూమి ఇచ్చి 3 ఏళ్లు గడుస్తున్నా ఇరిగేషన్ శాఖ అనుమతులు రాలేదు. ఇటీవల సీఎం రేవంత్ అధికారులను హెచ్చరించిన వారిలో చలనంలేదు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చినా అనుమతులు నిలువరించడంపై రైతులు మండిపడుతున్నారు. నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
News September 19, 2025
ADB: పత్తి కొనుగోళ్లకు కొత్త యాప్..!

పత్తి కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించడానికి కేంద్రం కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. కనీస మద్దతు ధరకు పంటను విక్రయించేందుకు ‘కపాస్ కిసాన్’ యాప్ను తెచ్చింది. రైతులు యాప్లో OTPతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత స్లాట్ బుక్ ఆప్షన్ ఉంటుంది. దానిని ఎంచుకోవాలి. తర్వాత భూమి వివరాలు నమోదు చేసి స్లాట్ వివరాలు చెక్ చేసుకోవాలి. ఉమ్మడి ADBలో 5 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగవుతోంది.