News September 21, 2024

నర్సాపూర్: డిపో సరే.. డ్రైవర్లు ఎక్కడా?

image

నర్సాపూర్‌లో ఆర్టీసి డిపో ఏర్పాటు కావడంతో ఇక తమ ప్రయాణ కష్టాలు తీరుతాయని ఈ ప్రాంత వాసులు ఆశించారు. అయితే ప్రయాణికుల అవసరాలకు తగినట్లు బస్సులు నడపకపోవడంతో అధికారులు విఫలమవుతున్నారు. డిపోలో ఉన్నా బస్సులకు అనుగుణంగా మొత్తం 45 మంది డ్రైవర్లకు 36 మంది ఉన్నారు. దీంతో సరైన రూట్లో బస్సులు నడువక అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 9, 2026

MDK: నిషేధిత చైనా మంజా విక్రయంపై పోలీసుల దాడులు

image

మెదక్ జిల్లా పరిధిలో నిషేధిత చైనా మంజా విక్రయిస్తున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మెదక్ టౌన్‌లో గోపీ మధు, నర్సాపూర్ పరిధిలో మహ్మద్ అబేద్, స్వప్నలపై చైనా మంజా విక్రయానికి కేసులు నమోదు చేశారు. చైనా మంజా ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమని, విక్రయం, నిల్వ, రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News January 8, 2026

మెదక్: ఈనెల 10 నుంచి డ్రాయింగ్ గ్రేడ్ పరీక్షలు

image

డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ పరీక్షలు ఈనెల 10 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు డిఈఓ విజయ తెలిపారు. మెదక్ బాలికల పాఠశాల కేంద్రంగా ఉ. 10 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు తమతో పాటు పెన్సిళ్లు, రంగులు, రైటింగ్ ప్యాడ్లు, టైలరింగ్, ఎంబ్రాయిడరీ పరికరాలను తెచ్చుకోవాలని సూచించారు. అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు.

News January 8, 2026

వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: కలెక్టర్‌

image

చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం అక్కన్నపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించిన కలెక్టర్, బోర్డు పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా బోధన అందించాలన్నారు.