News April 9, 2025
నర్సీపట్నంలో అర్ధరాత్రి హత్య

నర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యన్న కాలనీకి చెందిన ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. మంగళవారం అర్ధరాత్రి ప్రసాద్, మహేశ్ అనే ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వారిని పంపించేశారు. పోలీసులు వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య మళ్లీ ఘర్షణ జరిగి ప్రసాదును మహేశ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు.
Similar News
News February 25, 2026
లలితా సహస్ర నామాలు పఠిస్తే..?

లలితా సహస్రనామ పారాయణం సకల కోరికలను నెరవేర్చే మహామంత్రం. అగస్త్యుడి కోరిక మేరకు హయగ్రీవుడు ఈ వెయ్యి నామాలను ఉపదేశించారు. ఈ స్తోత్రం 183 శ్లోకాల సమాహారం. దీనిని భక్తితో, ఉచ్చారణ దోషాలు లేకుండా పారాయణం చేస్తే అపమృత్యువు తొలగి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ‘ప్రతి నామం ఓ మంత్రం. అర్థం తెలుసుకుని చదివితే అఖండ ఫలితముంటుంది. సృష్టికి మూలమైన ఆ తల్లి అనుగ్రహం కోసం ఇది శ్రేష్ఠం’ అంటున్నారు పండితులు.
News February 25, 2026
పాలమూరు: శ్రీరంగాపురం వెళ్తున్నారా?

వనపర్తి(D) శ్రీరంగాపురం రంగనాథస్వామి గుడి ఉమ్మడి MBNR జిల్లాలోని పురాతన వైష్ణవాలయాల్లో ఒకటిగా పేరొందింది. సుమారు 340 ఏళ్ల క్రితం వనపర్తి సంస్థాన ప్రభువు అష్టభాషా బహిరీ గోపాలరావు హయాంలో దీనిని నిర్మించారని చరిత్ర చెబుతోంది. రంగ సముద్రం చెరువు ఒడ్డున ఉన్న ఈ గుడి అద్భుత శిల్ప కళతో భక్తులను కట్టిపడేస్తోంది. కాగా నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవనుండగా మార్చి 6 వరకు జరగనున్నాయి. SHARE IT
News February 25, 2026
HYD: నేనేం నేరం చేశానమ్మా..

‘ఏడిస్తే గుండెలకు హత్తుకుంటావని, ఆకలైతే పాలు తాగిస్తావని అనుకున్నానమ్మా. చిట్టిచేతులు కట్టేసి, గంతలు కడితే దాగుడు మూతలు ఆడుతున్నావ్ అనుకున్నానమ్మా! పొయ్యిలో నన్ను కాలుస్తుంటే ఇలా నిన్ను అమ్మా అని పిలుస్తాననుకోలేదు. నోట్లో గుడ్డలు కుక్కింది నువ్వని తెలిసి విలవిలలాడానమ్మా. ఏంనేరం చేశా నాకెందుకీ శిక్ష’ భౌరంపేట్లో <<19230114>>పసిబిడ్డ<<>> ఇలా అనుకుని ఉంటుందేమో. 9నెలలు మోసిన తల్లే చంపడం నగరాన్ని కలవరపెడుతోంది.


