News April 9, 2025

నర్సీపట్నంలో అర్ధరాత్రి హత్య

image

నర్సీపట్నం మున్సిపాలిటీ అయ్యన్న కాలనీకి చెందిన ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. మంగళవారం అర్ధరాత్రి ప్రసాద్, మహేశ్ అనే ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వారిని పంపించేశారు. పోలీసులు వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య మళ్లీ ఘర్షణ జరిగి ప్రసాదును మహేశ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు.

Similar News

News November 10, 2025

నర్సంపేట: క్లాత్ స్టోర్ దగ్ధం.. రూ.80 లక్షల నష్టం..!

image

నర్సంపేటలోని జయశ్రీ టాకీస్ సమీపంలో ఉన్న శివరామ క్లాత్ స్టోర్‌లో సోమవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే మంటలు షాపు మొత్తాన్ని చుట్టుముట్టాయి. ప్రమాద సమయంలో షాపులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అప్రమత్తంగా బయటపడటంతో ప్రాణనష్టం తప్పింది. అయితే, విలువైన దుస్తులు దగ్ధం కావడంతో సుమారు రూ.80 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు యజమాని రాజు తెలిపారు.

News November 10, 2025

వరుసగా అబార్షన్లు అవుతున్నాయా?

image

గర్భం దాల్చిన ప్రతిసారీ అబార్షన్ అవుతుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. రెండోసారి అబార్షన్ జరిగితే డాక్టర్ పర్యవేక్షణలో టెస్టులు చేయించి మందులు వాడాలి. గర్భస్రావం జరిగినప్పుడు పిండాన్ని టెస్టుకి పంపి జన్యు సమస్యలున్నాయో తెలుసుకోవచ్చు. మేనరికంలో అయితే దంపతులకి టెస్టులు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు రక్తపరీక్షలు, స్కానింగ్, థైరాయిడ్ టెస్టులు జరిపి వాటికి తగ్గ ట్రీట్‌మెంట్ చేయాలి.

News November 10, 2025

తిరుపతి: “H.A.N.U.M.A.N” ప్రాజెక్ట్ అంటే ఏంటి…?

image

మానవ, అడవి జంతువుల ఘర్షణ పెరుగుతున్న నేపథ్యంలో AP ప్రభుత్వం “H.A.N.U.M.A.N” ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. Healing and Nurturing Units for Monitoring, Aid and Nursing of Wildlife అని అర్థం. ఈ ప్రాజెక్టు ద్వారా అడవి జంతువులతో జరిగే ప్రమాదాలను తగ్గించడం, ప్రజల ప్రాణాలు, పంటలు, పశువులను రక్షించడం ముఖ్య లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించింది.