News February 26, 2025
నర్సీపట్నంలో అల్లూరి జిల్లా వాసి మృతి

నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం నడింపాలెం గ్రామానికి చెందిన పనసల చంద్రశేఖర్ ఉరివేసుకున్నాడు. ఉదయాన్నే వాకింగ్కి వెళ్లిన వ్యక్తులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహం వద్ద కాలేజీ బ్యాగ్ దొరికిందని పోలీసులు తెలిపారు. అందులో ఉన్న పర్సులో ఆధార్ కార్డు లభించింది. దాని ఆధారంగా మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
Similar News
News November 21, 2025
ADB: వైద్యుల నిర్లక్ష్యం.. తల్లిబిడ్డ మృతి

గుడిహత్నూర్ మండలం శాంతపూర్ గ్రామానికి చెందిన గర్భిణి చిక్రం రుక్మాబాయి నిన్న పురిటి నొప్పులతో 108 సహకారంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు రెండవ కాన్పు సిజేరియన్ చేయగా, డెలివరీ తర్వాత నిన్న రాత్రి తల్లి, బిడ్డ ఇద్దరూ మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య, బిడ్డ మృతి చెందారని భర్త చిక్రం సుభాశ్ ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
News November 21, 2025
వేములవాడ: ఒంటిపై గాయాలతో యువకుడి వీరంగం

సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో సాయి అనే యువకుడు ఒంటిపై గాయాలతో వీరంగం సృష్టించాడు. చొక్కా లేకుండా రక్తం కారుతున్నా అటు, ఇటు తిరుగుతూ హల్చల్ చేశాడు. సదరు యువకుడి చేష్టలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని, యువకుడిని చికిత్స నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. భార్య కాపురానికి రావడం లేదనే సాయి ఇలా ప్రవర్తిస్తున్నాడని తెలిసింది.
News November 21, 2025
కామారెడ్డి: నిఖత్ జరీన్కు కవిత అభినందనలు

మహిళల 51 కేజీల ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న నిఖత్ జరీన్కు తెలంగాణ జాగృతి చీఫ్ కవిత అభినందనలు తెలిపారు. మీ అచంచలమైన అంకితభావం ప్రతి విజయంలోనూ ప్రతిఫలించింది. ఈ ఘన విజయం భారతదేశానికి ముఖ్యంగా తెలంగాణకు అపారమైన గర్వకారణం అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరెన్నో అద్భుతమైన విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ‘X’ వేదికగా ఆమె ట్వీట్ చేశారు.


