News February 18, 2025
నర్సీపట్నంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రెండు రోజుల నుంచి తన స్వగ్రామమైన నర్సీపట్నంలో సందడి చేస్తున్నారు. తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ ఇంటికి తల్లిని చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా నర్సీపట్నం పరిసర గ్రామాలకు చెందిన అభిమానులు ఆయన్ను కలిసి ఫొటోలు తీసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణ రాజు సోమవారం ఆయనతో భేటీ అయ్యారు.
Similar News
News December 5, 2025
డిసెంబర్లోనే సింగూరు పునరుద్ధరణ పనులు

వర్షాకాలంలో భారీ వర్షాలకు పూర్తిగా నిండిన సింగూరు ప్రాజెక్టు లోపలి భాగం దెబ్బతిని, గేట్లు మరమ్మతులకు రావడంతో ప్రాజెక్టు ప్రమాదం అంచుల్లోకి చేరింది. దీనిపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపడంతో, డ్యామ్ సెఫ్టీ బృందం పరిశీలించింది. ప్రాజెక్టు గేట్లను 159 మీటర్ల వరకు ఎత్తి, ఈ నెలలో రెండు విడతలుగా పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని బృందం నిర్ణయించింది.
News December 5, 2025
కృష్ణా: 48 వేల అపార్ ఐడిలు పెండింగ్.!

విద్యార్థుల వివరాలు, సర్టిఫికెట్ల డిజిటలైజేషన్ కోసం తప్పనిసరి చేసిన 12 అంకెల ‘అపార్ ఐడీ’ నమోదు ప్రక్రియలో ఆధార్, పుట్టిన తేదీ లోపాల కారణంగా NTR జిల్లాలో 37 వేలు, కృష్ణా జిల్లాలో 11 వేల మందికి పైగా వివరాలు నమోదు కాలేదు. దీంతో, తప్పులు సరిదిద్దే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లు ఆర్డీఓలు, ఎంఆర్ఓలకు ఆదేశాలు జారీ చేశారు. అపార్ ఐడీతో దొంగ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు.
News December 5, 2025
డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో 19 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీటిలో హెడ్ SeMT, సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి BE/B.Tech/BCA/BSc(IT)/BSc(CS), M.Tech/MS/MBA/MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://ora.digitalindiacorporation.in


