News February 18, 2025

నర్సీపట్నంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్

image

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రెండు రోజుల నుంచి తన స్వగ్రామమైన నర్సీపట్నంలో సందడి చేస్తున్నారు. తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ ఇంటికి తల్లిని చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా నర్సీపట్నం పరిసర గ్రామాలకు చెందిన అభిమానులు ఆయన్ను కలిసి ఫొటోలు తీసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణ రాజు సోమవారం ఆయనతో భేటీ అయ్యారు.

Similar News

News February 23, 2026

గుంటూరు SP PGRSకు 215 ఫిర్యాదులు

image

గుంటూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSకు 215 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కుటుంబ వివాదాలు, ఆస్తి, భూ తగాదాలు, రుణ, ఆర్థిక సమస్యలు, మోసపూరిత కేసులు, వ్యక్తిగత, సామాజిక సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వచ్చాయన్నారు. ఫిర్యాదులను సమగ్రంగా విచారించి చట్టపరంగా గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

News February 23, 2026

మెట్రో ఇక సర్కారు సొంతం.. ఎల్&టీతో ‘సెటిల్మెంట్’

image

TG: హైదరాబాద్ మెట్రో రైలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఎల్&టీకి ఉన్న రూ.13,000 కోట్ల అప్పును ప్రభుత్వమే భరిస్తుందని సమాచారం. అలాగే ఆ సంస్థకు ఈక్విటీ కింద రూ.2,000 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. మార్చి 31 లోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి, రెండో దశ విస్తరణకు కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు చర్యలు చేపట్టనుంది.

News February 23, 2026

జగిత్యాల జిల్లాలో ముందస్తు చర్యలు: ఎస్.ఈ

image

జగిత్యాల జిల్లా విద్యుత్ వినియోగదారులకు వేసవిలో మెరుగైన, నాణ్యమైన, నిరంతర సరఫరా అందించేందుకు అన్ని స్థాయిల్లో ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్.ఈ. బి.సుదర్శనం తెలిపారు. 45 ఓవర్‌లోడ్ ట్రాన్స్‌ఫార్మర్లు,96 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, 9 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. 2 కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టి, అవసరమైన చోట17 కొత్త బ్రేకర్లు అమర్చామన్నారు. ఇంటర్‌లింక్ లైన్ మెరుగుపర్చామన్నారు.