News February 18, 2025
నర్సీపట్నంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రెండు రోజుల నుంచి తన స్వగ్రామమైన నర్సీపట్నంలో సందడి చేస్తున్నారు. తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ ఇంటికి తల్లిని చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా నర్సీపట్నం పరిసర గ్రామాలకు చెందిన అభిమానులు ఆయన్ను కలిసి ఫొటోలు తీసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణ రాజు సోమవారం ఆయనతో భేటీ అయ్యారు.
Similar News
News October 25, 2025
జనగామ జిల్లాలో 134 మంది సర్వేయర్ల ఎంపిక..!

భూమి కొలతలు, భూ తగాదాలు, సర్వేయర్ల కోసం రోజుల తరబడి పడిగాపులు పడాల్సి వచ్చేది. ఇక ఆ సమస్య తీరనుంది. జనగామ జిల్లాకు 134 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు ఎంపికయ్యారు. వారికి త్వరలో ఎవరు ఎక్కడికి అనేది పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. మొత్తం 29 క్లస్టర్లకు గాను, క్లస్టర్ల వారీగా పోస్టింగ్ ఇవ్వనున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి రైతులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పడినట్లే.
News October 25, 2025
వరంగల్: మామిడి రైతులు ఇవి పాటించండి!

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దివిటిపల్లిలో మామిడి తోటలను ఉద్యాన శాఖ డివిజన్ అధికారి రాకేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పూతకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో తేనెమంచు పురుగు ఉద్ధృతి ఉన్నందున, ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ + బవిస్టిన్ 2 గ్రాములు + 13-0-45 10 గ్రాములు + వేపనూనె 10000 ppm 2 మి.లీ ద్రావణం చెట్టుకు 8-10 లీటర్లు పిచికారీ చేయాలని సూచించారు.
News October 25, 2025
SAILలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(SAIL) అనుబంధ సంస్థ<


