News February 18, 2025
నర్సీపట్నంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్

డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రెండు రోజుల నుంచి తన స్వగ్రామమైన నర్సీపట్నంలో సందడి చేస్తున్నారు. తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ ఇంటికి తల్లిని చూసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా నర్సీపట్నం పరిసర గ్రామాలకు చెందిన అభిమానులు ఆయన్ను కలిసి ఫొటోలు తీసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణ రాజు సోమవారం ఆయనతో భేటీ అయ్యారు.
Similar News
News April 17, 2026
మళ్లీ హనుమకొండ పార్లమెంట్ సెగ్మెంట్?

మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో మళ్లీ పాత హనుమకొండ రానున్నట్టు తెలుస్తోంది. గతంలోవరంగల్, హనుమకొండ ఎంపీ సెగ్మెంట్లు ఉండేవి. ఉమ్మడి జిల్లాలో జనగామ ప్రాంతం భువనగిరి పరిధిలో ఉండగా, దానిని హనుమకొండలో విలీనం చేయనున్నట్లు సమాచారం. దీంతో పాటుగా మహబూబాబాద్ , ఏటూరునాగారం, నర్సంపేట, డోర్నకల్ సెగ్మెంట్లను వరంగల్లో, పినపాక, ఇల్లెందులను కొత్తగా భద్రాచలంలో విలీనం చేసే ఛాన్సుంది.
News April 17, 2026
KNR: ‘బ్యాక్డోర్’ ఆశ చూపి రూ.5 కోట్ల దోపిడీ

జాబ్ గ్యారెంటీ అంటూ ‘బ్యాక్డోర్’ ఆశ చూపి నిరుద్యోగుల జేబులకు భారీ కన్నం వేశారు కేటుగాళ్లు. సికింద్రాబాద్ కేంద్రంగా సాగిన ఈ ‘మాల్టా’ దందాలో 100మంది రూ.5కోట్లు పోగొట్టుకున్నారు. నకిలీ ఆఫర్ లెటర్లు సృష్టించి ఒక్కొక్కరి నుంచి రూ.4లక్షల వరకు వసూలు చేశారు. కరీంనగర్, ఖానాపూర్, KPHBలో బాధితులు ఫిర్యాదు చేయడంతో వీటన్నింటినీ ఏకీకృతం చేసి CIDకి బదిలీ చేశారు. ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఖాతాలను ఫ్రీజ్ చేశారు.
News April 17, 2026
వెల్గటూర్: స్టేట్ ఫస్ట్ సాధించిన సౌమ్యశ్రీని అభినందించిన టీచర్లు

వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని గాలి సౌమ్యశ్రీ జూనియర్ ఇంటర్ పరీక్షల్లో 470కి 469 మార్కులు సాధించి రాష్ట్ర తొలి స్థానం దక్కించుకుంది. ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు తులసి ఆగమయ్య, ఉపాధ్యాయ బృందం, వార్డు సభ్యులు పాల్గొని అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


