News April 3, 2025

నర్సీపట్నంలో విషాదకర ఘటన

image

నర్సీపట్నంలో కొడుకు మృతి చెందాడనే మనస్తాపంతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. 15 రోజుల క్రితం కోన రాము ఆకస్మాత్తుగా మృతి చెందాడు. దీంతో తల్లి కోన గౌరీ చిన్న కుమారుడు మృతి చెందడంతో మానసిక క్షోభకు గురై దిగులతో ఉండిపోయింది. దీంతో ఈనెల 2న గౌరీ ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఆమెను వెతికే క్రమంలో గురువారం ఉత్తరవాహిని వద్ద శవమై కనిపించింది. పెద్ద కుమారుడు దుర్గారావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News April 18, 2025

బొబ్బిలిలో ఉచిత కంప్యూటర్ శిక్షణ

image

బొబ్బిలిలోని శ్రీవెంకటకృష్ణ థియేటర్ ఎదురుగా ఉన్న షాపింగ్ కంప్లెక్స్‌‌లో విద్యార్థి JAC ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్‌ శిక్షణను శుక్రవారం ప్రారంభించారు. వేసవి సెలవులలో విద్యార్థులకు JAC ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని రాష్ట్ర అధ్యక్షుడు బి.సాయి కిరణ్ చెప్పారు. ఎంఎస్ ఆఫీస్, ట్యాలీ, DTP, C, C ప్లస్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు.

News April 18, 2025

WILDLIFE PHOTOS: గాయపడిన సింహం

image

అడవికి రారాజు సింహమే అయినా ఆహారం కోసం అది వేటాడాల్సిందే. ఈ ప్రక్రియలో ఒక్కోసారి అవి తీవ్రంగా గాయపడిన పరిస్థితులూ ఉన్నాయి. మనుగడ కోసం జరిగిన ఘర్షణలో గాయపడిన ఓ సింహపు ఫొటోలను వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ హర్మన్ సింగ్ హీర్ క్లిక్‌మనిపించారు. తలపై గాయాలు, ఎడమ కన్ను పూర్తిగా దెబ్బతిని కనిపించింది. అడవిలో ఆధిపత్యం కోసం జరిగే పోరాటంలో సింహాలు ఎంతలా గాయపడతాయో ఈ ఫొటోల్లో చూపించారు.

News April 18, 2025

VIRAL: నీ కష్టం పగోడికి కూడా రావొద్దు బ్రో!

image

తన ప్రియురాలు తనకంటే 22 ఏళ్లు పెద్దదని తెలియడంతో ఓ యువకుడు SMలో ఆవేదన వ్యక్తం చేశాడు. ‘నాకు 26 ఏళ్లు. నాలుగేళ్లుగా ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నా. కొన్ని రోజుల క్రితం ఆమె వయసు 27 కాదు, 48 అని తెలిసింది. ఆమె అంత వయసైనట్లు కనిపించదు. ఆమె స్నేహితులు 30+ వాళ్లే ఉండేవాళ్లు. ఏవైనా డాక్యుమెంట్స్ అడిగితే ఇచ్చేది కాదు. ల్యాప్‌టాప్‌లో పాస్‌పోర్టు చూడటంతో ఇది తెలిసింది. నేనిప్పుడు ఏం చేయాలి?’ అని అతను వాపోయాడు.

error: Content is protected !!