News April 6, 2025

నర్సీపట్నం: ‘అధికారులతో స్పీకర్ సమీక్ష’

image

శనివారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రోడ్లు, భవనాల శాఖ ఎస్ఈ సుధాకర్, పర్యాటక శాఖ అధికారి కె.రమణలతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. నర్సీపట్నం ట్యాంక్ బండ్ వద్ద విగ్రహాలు, ఆధునిక లైటింగ్, భూ సౌందర్యం (ల్యాండ్‌ స్కేపింగ్), బ్యూటిఫికేషన్ అలంకరణతో కూడిన పూల తోటలు తదితర అంశాలపై చర్చించారు.  ఆర్డీవో వివి.రమణ, మున్సిపల్ కమిషనర్ సురేంద్ర పాల్గొన్నారు.

Similar News

News October 21, 2025

ADB: నేటికీ చెదరని జ్ఞాపకాలు!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1983 నుంచి నక్సలైట్ల అలజడిలో ఖానాపూర్ సర్కిల్ పరిధిలో 19 మంది పోలీసులు అమరులయ్యారు. తుపాకీ మోత చప్పుళ్లతో అల్లకల్లోలమైన అప్పటి పరిస్థితులు నేటికీ ఒళ్లు జలదరింపజేస్తున్నాయి. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ అమరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు. అమరవీరుల కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది.

News October 21, 2025

HYD: పోలీస్ బాస్.. మీ సేవలకు సెల్యూట్

image

నిజాయితీకి ప్రతీక, ధైర్యానికి పర్యాయపదం ఉమేశ్ చంద్ర ఐపీఎస్. వరంగల్‌లో ASPగా నక్సలైట్లను అణచివేశారు. కడప SPగా ఫ్యాక్షన్‌ను కట్టడి చేసి ‘కడప సింహం’గా ఖ్యాతి గడించారు. కరీంనగర్‌లో శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించారు. చివరగా AIGగా సేవలందించారు. ప్రజల కోసం పోరాడి ‘ప్రజల పోలీస్’గా పేరుగాంచారు. ఆయన బదిలీ వార్తపై ప్రజలు రోడ్డెక్కి కన్నీరు పెట్టారు. 1999 SEP 4న HYD SRనగర్‌లో నక్సలైట్ల దాడిలో కన్నుమూశారు.

News October 21, 2025

పార్వతీపురం మన్యం: మీ సేవలు మరువం..!

image

రేయింబవళ్లు కష్టపడి శాంతిభద్రతలను కాపాడే రక్షభటులకే కొన్ని సందర్భాల్లో రక్షణ కరువవుతోంది. పార్వతీపురం జిల్లాలో సీఐ ముద్దాడ గాంధీ, ఏ.ఆర్ కానిస్టేబుల్ షేక్ ఇస్మాయిల్, సివిల్ కానిస్టేబుల్లు బి.శ్రీరాములు, సీహెచ్.చిరంజీవిరావు, ఎస్.సూర్యనారాయణ విధుల్లో ఉండగా ప్రాణాలు విడిచారు. నేడు ‘పోలీసు అమరవీరుల సమస్మరణ దినోత్సవం’ సందర్భంగా వారి త్యాగాలను స్మరించుకుంటూ పార్వతీపురంలో స్మృతి పరేడ్ నిర్వహించనున్నారు.