News March 10, 2025

నర్సీపట్నం: ఇంటర్ పరీక్షల్లో అనుచిత తనిఖీలు 

image

నర్సీపట్నం ఏబీఎం కాలేజీలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో తనిఖీల పేరిట విద్యార్థులతో డ్యూటీ ఆఫీసర్ ప్రసాద్ అనుచిత వైఖరి ప్రదర్శించినట్లు విమర్శలొచ్చాయి. దీంతో అతనిని ఆ విధులు నుంచి తప్పించినట్లు ఇంటర్ విద్యాశాఖ అధికారిణి సుజాత తెలిపారు. విద్యార్థులు చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టామని నేరం రుజువు కావడంతో చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. 

Similar News

News December 2, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు సినీ గ్లామర్

image

TG: ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌‌లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. తొలి రోజు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీత విభావరి నిర్వహిస్తారు. 2వ రోజున మీడియా ఇన్వెస్ట్‌మెంట్ కార్యక్రమంలో ‘పుష్ప’ స్టార్ డైరెక్టర్ సుకుమార్, ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి, బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ పాల్గొంటారు. మరికొంతమంది కళాకారులు సమ్మిట్‌లో సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించనున్నారు.

News December 2, 2025

ఖమ్మం: 20 ఏళ్ల కింద తోడికోడళ్లు.. ఇప్పుడు అన్నదమ్ములు

image

పెనుబల్లి మండలం యడ్లబంజరు గ్రామ పంచాయతీలో ఆసక్తికర రాజకీయ పోరు నెలకొంది. 20 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్న ఈ గ్రామంలో, ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు రాజిన్ని అప్పయ్య, రాజిన్ని రాంబాబు సర్పంచ్‌‌ బరిలో నిలుస్తున్నారు. 2 దశాబ్దాల కిందట తోడికోడళ్లు పోటీ పడగా, రాంబాబు, ఆయన భార్య సునీత గతంలో 3 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ గ్రామంలో ఎస్టీ ఓటర్లు ఒకే కుటుంబం కావడంతో ఈ పోటీ అనివార్యమైంది.

News December 2, 2025

ఖమ్మం: 20 ఏళ్ల కింద తోడికోడళ్లు.. ఇప్పుడు అన్నదమ్ములు

image

పెనుబల్లి మండలం యడ్లబంజరు గ్రామ పంచాయతీలో ఆసక్తికర రాజకీయ పోరు నెలకొంది. 20 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్న ఈ గ్రామంలో, ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు రాజిన్ని అప్పయ్య, రాజిన్ని రాంబాబు సర్పంచ్‌‌ బరిలో నిలుస్తున్నారు. 2 దశాబ్దాల కిందట తోడికోడళ్లు పోటీ పడగా, రాంబాబు, ఆయన భార్య సునీత గతంలో 3 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ గ్రామంలో ఎస్టీ ఓటర్లు ఒకే కుటుంబం కావడంతో ఈ పోటీ అనివార్యమైంది.