News March 16, 2025

నర్సీపట్నం: జీవితం  మీద విరక్తితో ఆత్మహత్య

image

నర్సీపట్నం మండలం నీలం పేట గ్రామానికి చెందిన పెట్ల నూకయ్య నాయుడు అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్ఐ రాజారావు తెలిపారు. ఆయన గత కొద్దికాలంగా డయాబెటిస్ తదితర అనారోగ్యంతో బాధపడుతున్నాడని అన్నారు. దీంతో జీవితం మీద విరక్తి చెంది పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం మరణించాడని పేర్కొన్నారు.

Similar News

News December 13, 2025

కోల్‌కతాలో ఉద్రిక్తత.. HYDలో పోలీసుల అలర్ట్

image

మెస్సీ టూర్ సందర్భంగా కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియంలో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో HYDలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ఫ్యాన్స్ గ్రౌండ్‌లోకి రాకుండా చర్యలు చేపడుతున్నారు. ఇవాళ సాయంత్రం ఇక్కడ మెస్సీ మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. అటు సాల్ట్ లేక్ స్టేడియంలో అభిమానులు టెంట్లు, ఫ్లెక్సీలు, కుర్చీలను <<18551215>>ధ్వంసం చేశారు<<>>. పోలీసులు వారిని చెదరగొట్టారు.

News December 13, 2025

తిరుమలలో పరకామణి మీకు తెలుసా?

image

తిరుమలలో భక్తులు హుండీలో సమర్పించే మొక్కుబడులు, కానుకలను లెక్కించే ప్రదేశమే ‘పరకామణి’. పూర్వం ఇది శ్రీవారి ఆలయం లోపల, ఆనంద నిలయం వెనుక ఉండేది. ప్రస్తుతం భద్రత, సాంకేతిక పరిజ్ఞానంతో, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం ఎదురుగా పరకామణి భవనాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వేలాది మంది భక్తులు సమర్పించిన కోట్ల రూపాయల కానుకల లెక్కింపు నిరంతరం జరుగుతూ ఉంటుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 13, 2025

గజ్వేల్: పల్లె పోరులో కారు జోరు

image

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన గజ్వేల్ నియోజకవర్గంలోని ఆరు మండల కేంద్రాలలో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో లేని జగదేవ్‌పూర్, ములుగు, మర్కూక్, వర్గల్, రాయపోల్, దౌల్తాబాద్ మండల కేంద్రాలలో బీఆర్‌ఎస్‌ హవా స్పష్టంగా కనిపించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలోని మేజర్ పంచాయతీల్లో ఈ గెలుపు కీలకంగా మారింది.