News February 23, 2025
నర్సీపట్నం: బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేయాలని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పోలీసు అధికారులను ఆదేశించారు. బడ్జెట్ సమావేశాల ఏర్పాటుపై ఆదివారం శాసనసభ ప్రాంగణంలో పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కొత్తగా నిర్మిస్తున్న క్యాంటీన్ పనులను పరిశీలించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.
Similar News
News October 19, 2025
పూతలపట్టులో చోరీ

పూతలపట్టు మండలం ఈ కొత్తకోట పంచాయతీ చౌటపల్లి దళితవాడలో రంగయ్య కుమారుడు పాటూరు దాము ఇంట్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 60 గ్రాములు బంగారు, వెండి కాళ్లపట్టీలు మూడు జతలు, రూ.50 వేలు నగదు చోరీ చేసి తీసుకెళ్లారు. ఈ మేరకు దాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి ఇంటిని తనిఖీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News October 19, 2025
NZB: రియాజ్ EXCLUSSIVE PHOTO

NZBలో కానిస్టేబుల్ను హత్య చేసిన రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్లు వచ్చిన వార్తలపై సీపీ సాయి చైతన్య ఖండించారు. సారంగపూర్లో నిందితున్ని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఆసిఫ్ అనే వ్యక్తిపై హత్య చేయడానికి ప్రయత్నించగా అక్కడ జరిగిన పెనుగులాటలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు రియాజ్ను పట్టుకుని, ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రియాజ్ EXCLUSSIVE PHOTO Way2Newsకు దొరికింది.
News October 19, 2025
నిర్మల్: శ్రీరామ్సాగర్ ఎస్కేప్ గేట్ల ద్వారా వరదనీటి విడుదల

శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు ఎస్కేప్ గేట్ల ద్వారా వరద నీటిని గోదావరి నదిలోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు ప్రాజెక్టు ఇన్ఫ్లో 6654 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 6654 క్యూసెక్కులుగా నమోదైంది. వరద ఉద్ధృతి దృష్ట్యా మత్స్యకారులు, సామాన్య ప్రజలు ఎవరూ నదిలోకి దిగరాదని అధికారులు విజ్ఞప్తి చేశారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.