News February 7, 2025
నర్సీపట్నం యాక్సిడెంట్లో మరణించిన ఉద్యోగి వివరాలు

నర్సీపట్నంలో శుక్రవారం ఉదయం బస్సు కిందపడి <<15385488>>మరణించిన <<>>ఫారెస్ట్ ఉద్యోగి వివరాలు తెలిసాయి. కొయ్యూరు మండలం మర్రుపాక సెక్షన్ ఆఫీసర్గా ఆర్.పుట్టన్న విధులు నిర్వహిస్తున్నారు. నర్సీపట్నంలో నివాసముండే పుట్టన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం విధులకు బయలుదేరిన పుట్టన్న రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరిలో విషాదం నిలిపింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది విచారణ వ్యక్తం చేశారు.
Similar News
News October 26, 2025
బాపట్ల: గమనిక.. రేపు పీజీఆర్ఎస్ రద్దు

ప్రతి సోమవారం జిల్లా కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 27 నుంచి 29వ తారీకు వరకు మొంథా తుఫాను ప్రభావం జిల్లాపై ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది కావున ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో ఎవరు సమస్యలకు సంబంధించిన అర్జీలతో జిల్లా కార్యాలయానికి సోమవారం రావద్దని తెలిపారు.
News October 26, 2025
సూర్యలంక బీచ్ వద్ద బారికేడ్లు

బాపట్ల మండలం సూర్యలంక బీచ్ వద్ద ఆదివారం పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో బీచ్ ఎంట్రన్స్ వద్ద పర్యాటకులు రాకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. బీచ్ సందర్శన కోసం వస్తున్న పర్యాటకులను వెనక్కి పంపించేశారు. పర్యాటకుల సందర్శన తాత్కాలికంగా నిషేధించినట్లు సిఐ చెప్పారు.
News October 26, 2025
ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి – మంత్రి అనగాని

మొంథా తుఫాన్ దృష్ట్యా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు .రెవెన్యూ, పోలీస్, NDRF బృందాలు పూర్తిగా సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. 27, 28, 29 తేదీలలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందుగానే సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ తీరందాటే వరకు సహాయ చర్యలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.


