News February 7, 2025

నర్సీపట్నం యాక్సిడెంట్‌లో మరణించిన ఉద్యోగి వివరాలు 

image

నర్సీపట్నంలో శుక్రవారం ఉదయం బస్సు కిందపడి <<15385488>>మరణించిన <<>>ఫారెస్ట్ ఉద్యోగి వివరాలు తెలిసాయి. కొయ్యూరు మండలం మర్రుపాక సెక్షన్ ఆఫీసర్‌గా ఆర్.పుట్టన్న విధులు నిర్వహిస్తున్నారు. నర్సీపట్నంలో నివాసముండే పుట్టన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం విధులకు బయలుదేరిన పుట్టన్న రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరిలో విషాదం నిలిపింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది విచారణ వ్యక్తం చేశారు.

Similar News

News December 8, 2025

ADB: ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో లోకల్ హాలిడే

image

రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ సూచన మేరకు, మూడు విడతలుగా జరిగే పంచాయతీ ఎన్నికలు ప్రాంతాల్లో లోకల్ హాలిడే ఉంటుందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా ఒక ప్రకటనలో తెలియజేశారు. పోలింగ్ ప్రాంతాల్లో ఈనెల 11, 14, 17 తేదీలలో ప్రభుత్వ కార్యాలయాలు, లోకల్ బాడీ, ప్రభుత్వ సంస్థలే కాకుండా ప్రైవేట్ సంస్థలు కూడా వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించారు.

News December 8, 2025

విశాఖ-రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎప్పుడు పూర్తవుతుందంటే?

image

విశాఖ-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ వే పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.16,482 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్ వే పనులు 2026 DECకి పూర్తి కానున్నాయి. మొత్తం 597KM మార్గాన్ని 465KMకి తగ్గిస్తూ 6 లైన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేగా నిర్మిస్తున్నారు. ఇది పూర్తైతే AP,ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మధ్య రహదారి కనెక్టివిటీ మెరుగపడి ప్రయాణ సమయం 7 గంటలు తగ్గుతుంది. దీంతో టూరిజం,పారిశ్రామిక రవాణా, వ్యాపార అవకాశాలకు ఊతం లభించనుంది.

News December 8, 2025

వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకులు

image

RBI <<18475069>>రెపో రేటును<<>> 0.25% మేర తగ్గించిన నేపథ్యంలో పలు బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా 0.25% తగ్గించాయి. రెపో అనుసంధానిత రుణ రేటును PNB 8.35 నుంచి 8.10%కి, BOB 8.15 నుంచి 7.90%కి, BOI 8.35 నుంచి 8.10%కి సవరించాయి. హోం లోన్ రేట్లు 7.10%, కార్ లోన్ రేట్లు 7.45% నుంచి ప్రారంభమవుతాయని BOM తెలిపింది.