News January 14, 2025
నలుగురికి పునర్జన్మనిచ్చిన ప్రొద్దుటూరు వాసి

ప్రొద్దుటూరు మండలం గోపవరానికి చెందిన గోపిరెడ్డి రాజశేఖర్రెడ్డి(53) బ్రెయిన్ డెడ్కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. రాజశేఖర్ ఈనెల 1న బైక్ పైనుంచి పడి అపస్మారక స్థితికి వెళ్లారు. 11 రోజుల చికిత్స అనంతరం వైద్యులు బ్రెయిన్డెడ్గా నిర్ధారించారు. దీంతో అతని భార్య శ్రీదేవి అవయవదానానికి సహకరించారు. దీంతో అతని అవయవాలతో నలుగురికి పునర్జన్మను కల్పించారు.
Similar News
News February 10, 2025
బీటెక్ రవిని ప్రశ్నించిన విచారణాధికారి

తనని కడప జైల్లో డాక్టర్ చైతన్య రెడ్డి బెదిరించారని మాజీ మంత్రి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవిని విచారణాధికారి రాహుల్ శ్రీరామ్ ప్రశ్నించారు. జైలులో దస్తగిరి బ్యారక్లో బీటెక్ రవి ఉన్నారు. ఈ నేపథ్యంలో దస్తగిరి బ్యారక్లోకి చైతన్య రెడ్డి వెళ్లాడా.. లేడా అని విచారణాధికారి బీటెక్ రవిని ప్రశ్నించినట్లు సమాచారం
News February 10, 2025
కడప: దస్తగిరికి నోటీసులు

మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. దస్తగిరిని సాక్షిగా పరిగణించడాన్ని సవాల్ చేస్తూ ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై ప్రత్యేక పీపీ, దస్తగిరికి హైకోర్టు నోటీసులు పంపింది. ఈనెల 27కు విచారణను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది..
News February 10, 2025
సమస్యలు ఉంటే అర్జీలతో రండి: కడప కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా కడప కలెక్టరేట్లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై ప్రజలు నేరుగా కలెక్టర్ కార్యాలయంలో తనకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. నలుమూలల నుంచి వచ్చే ప్రజల కోసం అన్నా క్యాంటీన్ ఆహారాన్ని కలెక్టరేట్లో ఏర్పాటు చేస్తున్నారు.