News April 18, 2024

నలుగురికే అనుమతి: ప్రకాశం SP

image

నామినేషన్ పత్రాలు దాఖలు చేసే అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి అనుమతిస్తామని ప్రకాశం ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ స్పష్టం చేశారు. అభ్యర్థుల పీఎస్వోలను ఆర్వో కార్యాలయంలోకి అనుమతించబోమన్నారు. తుపాకులను వెంట తీసుకు వెళ్లరాదని సూచించారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు. ర్యాలీలో టపాసులు కాల్చకూడదని చెప్పారు.

Similar News

News April 23, 2025

పోలీస్ ఉద్యోగం గొప్ప అవకాశం: ప్రకాశం ఎస్పీ

image

బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పోలీసుశాఖ ప్రతిష్ఠ మరిం‌త పెంచాలని ఎస్పీ దామోదర్ సూచించారు. ఒంగోలులోని‌ జిల్లా పోలీస్ కార్యాలయంలో ముగ్గురు కానిస్టేబుళ్లకు ఆయన మంగళవారం‌ నియామక‌పత్రాలు అందజేశారు. పోలీస్ శాఖలో చేరడం గొప్ప అవకాశమన్నారు. ప్రజల భద్రతను కాపాడటం, శాంతిభద్రతలను పరిరక్షించడం ముఖ్య కర్తవ్యమని‌ సూచించారు.

News April 23, 2025

FLASH: ఒంగోలు మాజీ MLAకు గుండెపోటు

image

ఒంగోలులో నిన్న రాత్రి టీడీపీ నేత, నాగులుప్పలపాడు మాజీ MPP ముప్పవరపు వీరయ్య చౌదరిని హత్య చేసిన విషయం తెలిసిందే. ఒంగోలు మాజీ MLA ఈదర హరిబాబుకు వీరయ్య చౌదరి మేనల్లుడు అవుతాడు. అల్లుడి మృతి వార్తతో హరిబాబు గుండెపోటుకు గురయ్యారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. మంత్రులు గొట్టిపాటి, స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల, విజయ్ కుమార్, ఉగ్ర నరసింహ రెడ్డి తదితరులు హరిబాబును పరామర్శించారు.

News April 23, 2025

ప్రకాశం జిల్లా 10వ తరగతి పరీక్షల సమాచారం

image

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో 29,602 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగాయి.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

error: Content is protected !!