News February 7, 2025
నల్గొండలో నామినేషన్ వేయనున్న అభ్యర్థులు

నామినేషన్లకు 7, 10వ తేదీల్లోనే అవకాశం ఉండటంతో ఈ2 రోజుల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు ప్రధాన సంఘాల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. శుక్రవారం TSUTF తరఫు ప్రస్తుత ఎమ్మెల్సీ ఆలుగుబెల్లి నర్సిరెడ్డి, అలాగే TPUS అభ్యర్థి సరోత్తంరెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి కూడా నామినేషన్లు సమర్పించనున్నారు. కాగా PRTU అభ్యర్థి శ్రీపాల్రెడ్డి 10న నామినేషన్ వేయనున్నట్లు సమాచారం.
Similar News
News November 27, 2025
స్విగ్గీని బురిడీ కొట్టించిన కస్టమర్.. నెటిజన్ల ఫైర్!

ఆన్లైన్ సైట్స్లో వస్తువులు డ్యామేజ్ వస్తే సదరు సంస్థ రీఫండ్ చేయడం చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తి డూప్లికేట్ ఫొటోతో ‘స్విగ్గీ ఇన్స్టామార్ట్’ను బురిడీ కొట్టించాడు. స్విగ్గీలో ఆర్డర్ చేసిన గుడ్ల ట్రే ఫొటోను, జెమిని నానో AI యాప్ ద్వారా గుడ్లు పగిలినట్లుగా ఎడిట్ చేసి కస్టమర్ కేర్కు పంపి, పూర్తి రీఫండ్ను పొందాడు. ఇలా చేయడం సరికాదని, నిజమైన బాధితులు నష్టపోతారని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
News November 27, 2025
కాకినాడ: వారిని చూసి జగన్ నేర్చుకోవాలి.. యనమల

అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీని చూసి ప్రతిపక్షం ఎలా వ్యవహరించాలో జగన్ చూసి నేర్చుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. చిన్నపిల్లలయినా బహిష్కరణలకు తావు కాకుండా సభలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రస్తావించారన్నారు. ఎప్పటికైనా జగన్ అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై చర్చించడం చేయాలని సూచించారు.
News November 27, 2025
SRCL: మహిళల ఓట్లపైనే అందరి ఆశలు..!

GP ఎన్నికల్లో గెలుపు కోసం CONG, BRS మహిళలపైనే ఆశలు పెట్టుకున్నాయి. జిల్లాలో 170772 మంది పురుషులు, 182559 మంది మహిళా ఓటర్లున్నారు. పురుషులతో పోలిస్తే మహిళల ఓట్లు 11787 అధికంగా ఉన్నాయి. దీంతో మహిళలను ప్రసన్నం చేసుకోవడానికి ఇరు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు, చీరలు, ఫ్రీ RTC ప్రయాణం వంటి పథకాల పేరిట CONG ఓట్లు అడగనుండగా, ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఓట్లు రాబట్టాలని BRS చూస్తోంది.


