News February 18, 2025

నల్గొండలో రౌడీషీటర్ అరెస్ట్

image

NLGలోని రాక్ హిల్స్ కాలనీకి చెందిన రౌడీషీటర్ రాజేశ్‌ను అరెస్టు చేసినట్లు NLG డీఎస్పీ శివ రాంరెడ్డి సోమవారం తెలిపారు. ఇతనిపై సుమారు 17 హత్యకేసులు ఉన్నట్లు తెలిపారు. పట్టణంతో పాటు ఎల్బీనగర్ ఏరియాను అడ్డాగా చేసుకొని భూసెటిల్మెంట్లు, గంజాయి మత్తులో పలువురికి ఫోన్లు చేసి బెదిరిస్తుండటంతో బాధితుల ఫిర్యాదుతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

Similar News

News April 10, 2026

NLG: మీరు గేదెల పథకానికి దరఖాస్తు చేయలేదా?

image

జిల్లాలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పాడి రైతులకు ప్రభుత్వం మరో అద్భుత అవకాశం కల్పించింది. రివైజ్డ్ ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద అమలు చేస్తున్న రెండు పాడి గేదెల పథకం దరఖాస్తు గడువును ఈ నెల 16 వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. అర్హత కలిగిన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంకెందుకు ఆలస్యం? అర్హులైన వారు వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.

News April 10, 2026

NLG: మూగజీవాల దాహార్తికి కలెక్టరేట్‌లో నీటి తొట్లు

image

భానుడి భగభగలకు అల్లాడుతున్న పక్షుల దాహం తీర్చేందుకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మానవత్వాన్ని చాటుకున్నారు. కలెక్టరేట్ ఆవరణలోని చెట్ల కొమ్మలకు నీటి తొట్లు, డబ్బాలను ఏర్పాటు చేయాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ చొరవతో సిబ్బంది వెంటనే నీటి వసతి కల్పించడంతో, పక్షులు దాహం తీర్చుకుంటున్నాయి. ఎండ తీవ్రత దృష్ట్యా మూగజీవాల పట్ల ఆయన చూపిన ఈ కారుణ్యాన్ని పర్యావరణ ప్రేమికులు ప్రశంసిస్తున్నారు.

News April 10, 2026

నాగార్జునసాగర్ సందర్శించిన 68 మంది ASOల బృందం

image

పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌ను కేంద్ర సెక్రటేరియట్ 68 మంది ASOల బృందం గురువారం రాత్రి సందర్శించింది. భారత్ దర్శన్‌లో భాగంగా వచ్చిన ఈ బృందం నాగార్జునకొండ మ్యూజియం, సాగర్ డ్యామ్‌ను వీక్షించింది. అనంతరం బుద్ధవనంలోని చరితవనం, జాతకవనం, ధ్యానవనం, స్తూపవనాలను సందర్శించారు. మహాస్తూపంలో లఘు చిత్రం వీక్షించి, ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు. పర్యాటక ప్రదేశాల విశేషాలను గైడ్ సత్యనారాయణ వివరించారు.