News May 21, 2024
నల్గొండ: అనుమానంతో భార్యను చంపాడు
భార్యపై అనుమానంతో భర్త కర్రతో చితక బాధడంతో తీవ్ర గాయాల పాలై మృతి చెందిన ఘటన తిప్పర్తి మండలం నూకలవారిగూడలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగరాజు తన భార్య జ్యోతిపై అనుమానం పెంచుకున్నాడు. జ్యోతి పొలంలో గేదెలు మేపుతుండగా అక్కడికి వెళ్లిన నాగరాజు కర్రతో దాడి చేయగా ఆమె మృతిచెందింది. మృతురాలి తండ్రి స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News October 3, 2024
నల్గొండ: కూలిన చెట్లు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ వర్షాలు కురిశాయి. సాయంత్రం మొదలైన వాన రాత్రి వరకూ కురిసింది. గాలి బీభత్సానికి కొన్ని చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోదాడ నుంచి వాయిల సింగారం వెళ్లే రహదారిపై చెట్లు కూలి రోడ్డుపై అడ్డంగా పడ్డాయి..వైర్లు తెగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కోదాడ 4 గంటలపాటు అంధకారంలో మునిగింది.
News October 3, 2024
యాదాద్రిలో నేటి నుంచి దేవి శరన్నానవరాత్రులు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయం కొండపైన గల పర్వత వర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో నేటి నుంచి 9రోజులపాటు దేవి శరన్నవరాత్రులను ఆలయాధికారులు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ 9 రోజులు దేవి శరన్నవరాత్రుల్లో భక్తులు రూ.1,116 చెల్లించి దేవిపూజల్లో పాల్గొనవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.
News October 2, 2024
ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా అనితా రామచంద్రన్
నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలకు ప్రత్యేక అధికారిగా పంచాయతీ రాజ్ కమిషనర్ అనితా రామచంద్రన్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె ప్రభుత్వం నిర్వహించే వివిధ కార్యక్రమాలకు ప్రత్యేక అధికారిగా వ్యవహరించనున్నారు. గతంలో ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన విషయం తెలిసిందే.