News March 15, 2026

నల్గొండ: అలర్ట్.. గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తుల సంచారం

image

అడవిదేవులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తులు తిరుగుతున్నారని పోలీసులు ఓ ఫొటోను రిలీజ్ చేశారు. బైక్‌పై వచ్చి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చానని చెప్పి, నీళ్లు కావాలని అడిగి ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళల మెడలోని బంగారం లాక్కొని పరారవుతున్నారని చెబుతున్నారు. బయటకు వెళ్లే వారు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే తమకు సమాచార ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

Similar News

News April 13, 2026

నాగార్జునసాగర్ డ్యాం స్పిల్‌వే పరిశీలన

image

నాగార్జునసాగర్ డ్యాం స్పిల్‌వేను కేంద్ర డ్యాం సేఫ్టీ బృందం ఛైర్మన్ శర్మ ఆధ్వర్యంలో పరిశీలించింది. స్పిల్‌వేపై ఏర్పడిన గుంతలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, భద్రతా ప్రమాణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బకెట్ పోర్షన్‌లో నీరు ఉండటంతో కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ, ప్రాజెక్టు రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక సూచనలు చేశారు. ఈ పర్యటనలో సత్యనారాజ్, గౌతమ్ పాల్గొన్నారు.

News April 13, 2026

NLG: అంగన్‌వాడీలో చిన్నారులకు డ్రెస్‌కోడ్..!

image

అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకునే చిన్నారుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి చిన్నారులకు ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను అమలు చేయనున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణవేణి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 9 ప్రాజెక్టుల పరిధిలో 2093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 45,543 మంది చిన్నారులకు త్వరలో దుస్తులు పంపిణీ చేస్తామన్నారు.

News April 13, 2026

NLG: ఒకే సీజన్‌లో రెండోసారి వాత

image

కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరగడంతో ఉమ్మడి జిల్లాలో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ యాసంగి సీజన్‌లోనే రెండోసారి ధరలు పెరగగా, తాజాగా బస్తాకు 225 రూపాయల నుంచి 300 రూపాయల వరకు అదనపు భారం పడింది. ఒక్క డీఏపీ, యూరియా మినహా పొటాష్ సహా మిగతా అన్ని రకాల ఎరువుల ధరలను కంపెనీలు అమాంతం పెంచేశాయి. దీనివల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులపై సుమారు 109.50 కోట్ల రూపాయల మేర అదనపు ఆర్థిక భారం పడనుంది.