News July 31, 2024
నల్గొండ ఆర్టీసీకి దండిగా ఆదాయం

ఉమ్మడి జిల్లాలో నష్టాల బాటలో ప్రయాణిస్తున్న ఆర్టీసీకి మహాలక్ష్మి పథకం వరంలా మారింది. ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఉమ్మడి జిల్లాలోని డిపోలు లాభాల బాట పట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం అమలులో భాగంగా ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. 2023- 24 మార్చి నాటికి రూ.49 కోట్ల ఆదాయంతో ఉమ్మడి జిల్లా రాష్ట్రంలో రెండో స్థానాన్ని దక్కించుకుంది.
Similar News
News November 19, 2025
జాతీయ జల అవార్డు అందుకున్న నల్గొండ జిల్లా

జల్ సంజయ్ & జన్ భగీదరి కార్యక్రమంలో దేశంలో ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాగా నల్గొండ ద్వితీయ స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి 6వ జాతీయ జల అవార్డు (రూ.2 కోట్ల ప్రైజ్ మనీ, ప్రశంసా పత్రం)ను అందుకున్నారు. వారికి పలువురు అభినందనలు తెలిపారు.
News November 19, 2025
నల్గొండ: బీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్

2025 -26 విద్యా సంవత్సరానికి గాను ప్రీమెట్రిక్ ఉపకార వేతనాల నమోదు కోసం జిల్లాలోని GHS, ZPHS, ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలల్లో 9 10వ తరగతి చదువుతున్న అర్హులైన BC, EBC విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజకుమార్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు DEC 15 లోపు https://telanganaepass.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
News November 18, 2025
చిత్తడి నేలల గుర్తింపు పూర్తి చేయాలి: కలెక్టర్

సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లాలో చిత్తడి నేలల గుర్తింపు కార్యక్రమాన్ని శనివారం నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన జిల్లా చిత్తడి నేలల సంరక్షణ, నిర్వహణ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చిత్తడి నేలల గుర్తింపును పూర్తి చేయాలని అన్నారు.


