News February 25, 2025

నల్గొండ: ఇంటర్, పది పరీక్షల నిర్వహణపై సమీక్ష

image

మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ జే.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.  సోమవారం ఆయన తన చాంబర్లో ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు ,మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని ఆయన తెలిపారు.

Similar News

News February 25, 2025

నల్గొండ జిల్లాలో అర్ధరాత్రి మహిళ దారుణ హత్య

image

నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలంలో దారుణ హత్య జరిగింది. గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాలు.. పెద్దగుమ్మడం గ్రామానికి చెందిన కుట్ర లక్ష్మమ్మ(45) ఇంట్లో నిద్రిస్తుండగా సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు మెడపై, తల భాగంపై దారుణంగా నరికి హత్య చేసి పరారయ్యారు. గుడిపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News February 25, 2025

NLG: ఎత్తుకు పైఎత్తులు.. మిగిలింది ఒక్కరోజే!

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రచారానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక కొంతమంది తాయిలాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా కొంతమంది అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.

News February 25, 2025

NLG: క్విజ్.. వీటికి సమాధానాలు తెలుసా?

image

☞ఎవరికాలంలో నల్గొండ నీలగిరిగా ప్రసిద్ధి చెందింది?
☞భూదానోద్యమాన్ని ఎవరు ప్రారంభించారు?
☞దేశోద్ధారక గ్రంథమాలను ఎవరు స్థాపించారు?
☞రావి నారాయణరెడ్డి జన్మస్థలం?
☞‘పల్లెటూరి పిల్లగాడ’ పాటను ఎవరు రచించారు?
★పై ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ చేయగలరు?

నోట్: మధ్యాహ్నం 2 గంటలకు ఇదే ఆర్టికల్‌లో జవాబులను చూడోచ్చు.

SHARE IT..

error: Content is protected !!