News March 18, 2025
నల్గొండ: ఇఫ్తార్ విందుకు ఫండ్స్ రిలీజ్

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు ప్రభుత్వం ఇఫ్తార్ విందుకు నిధులు విడుదల చేసింది. నియోజకవర్గాల వారీగా నిధులు (రూ.లక్షలలో) నల్గొండ-5, మిర్యాలగూడ-4, దేవరకొండ-3, సాగర్-3,నకిరేకల్-3, మునుగోడు-3, కోదాడ-4, సూర్యాపట-3, హుజూర్ నగర్-3, తుంగతుర్తి-3, భువనగిరి-3, ఆలేరు-2 లక్షలు నిధులు మంజూరు చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 18, 2025
ఏప్రిల్ మూడో వారంలోగా రీ సర్వే పూర్తి: నెల్లూరు జేసీ

జిల్లాలో ఎంపిక చేసిన 35 గ్రామాలలో ఏప్రిల్ మూడో వారంలోగా రీసర్వే పూర్తి చేస్తామని జాయింట్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు. మండలంలోని పిడూరు గ్రామంలో జరుగుతున్న రీ సర్వేని ఆయన మంగళవారం పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు, సలహాలు అందజేశారు. నోషనల్ ఖాతాలు లేకుండా చూడాలన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 35 గ్రామాలను రీ సర్వే చేయడానికి పైలెట్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేశామన్నారు.
News March 18, 2025
కామారెడ్డి: నీటి సరఫరాకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: కలెక్టర్

కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మిషన్ భగీరథ నీటి సరఫరాకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో మిషన్ భగీరథ, మెడికల్ కళాశాల అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శాశ్వత ప్రాతిపదికన మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
News March 18, 2025
మే 20న దేశవ్యాప్త సమ్మె

లేబర్ కోడ్ రద్దు, ప్రైవేటీకరణ నిలిపివేయాలని కేంద్రాన్ని పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కనీస జీతం ₹26Kకు పెంచాలని, EPS కింద ₹9K పెన్షన్ ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ద్వారా కార్మికులతో సంప్రదింపులు జరపాలని కోరుతున్నాయి. ఈ మేరకు మే 20న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ రెండు నెలలపాటు కార్మికుల సమస్యలపై అన్నిరాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించనున్నాయి.