News February 1, 2025
నల్గొండ: ఈసారైనా బడ్జెట్లో మోక్షం కలిగేనా…!

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. దశాబ్దాల కాలం నుంచి నూతన రైల్వే లైన్ల కోసం నల్గొండ జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. శంషాబాద్ -SRPT – VJD హై స్పీడ్ రైల్వే లైన్, డోర్నకల్-SRPT-NLG-గద్వాల్ రైల్వే లైన్ కోసం గత ఏడాది సర్వే చేశారు. డోర్నకల్-MLG రైల్వే లైన్, హైదరాబాద్-యాదాద్రి ఎంఎంటీఎస్ రైలుపై బడ్జెట్లో ప్రకటన ఉంటుందో లేదో మరి చూడాలి.?
Similar News
News March 12, 2025
NLG: GGHలో భద్రత డొల్ల!…

NLG ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత కరువైందని రోగులు అంటున్నారు. ఆసుపత్రికి నిత్యం 1,500 మంది అవుట్ పేషెంట్లు, సుమారు 600 వరకు ఇన్ పేషెంట్లు వస్తుంటారన్నారు. పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నా GGHలో భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నట్లు చెబుతున్నారు. కాగా ఇటీవల బాలుడి కిడ్నాప్ ఉందంతం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
News March 12, 2025
నల్గొండ జిల్లా వాసుల ఎదురుచూపు..!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో NLG జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో పరిశ్రమలు, మునుగోడులో డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకాల పూర్తి చేయాల్సి ఉంది. కట్టంగూరు మండలం ఆయిటి పాముల ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు.
News March 12, 2025
నల్గొండ: భర్తను హత్య చేసిన భార్య

ఉద్యోగం కోసం భర్తను చంపిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. DSP శివరాం రెడ్డి వివరాలిలా.. ఉస్మాన్పురకు చెందిన అక్సర్ జహ, చర్లగౌరారంలోని ZPHSలో అటెండర్గా పనిచేస్తున్న మహమ్మద్ ఖలీల్ హుస్సేన్ దంపతులు. గత నెల 25న ఖలీల్ హుస్సేన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈనెల 7న నిర్వహించిన పోస్టుమార్టంలో మృతుడు హత్యకు గురయ్యాడని తేలడంతో విచారించగా భార్య నేరం ఒప్పుకుంది.