News June 11, 2024
నల్గొండ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చిగురిస్తున్న ఆశలు

కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ త్వరలో ఉంటుందని కేబినెట్ మీటింగ్లో విధి విధానాలు రూపొందించినట్లు మంత్రి ఉత్తమ్ తాజాగా వెల్లడించడంతో ఉమ్మడి జిల్లా ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సన్నబియ్యం పంపిణీ చేపడతామని చెప్పడంతో లబ్ధిదారులు ఖుషీ అవుతున్నారు. నూతన కార్డుల కోసం 39,874, కార్డుల్లో మార్పునకు 63,691 దరఖాస్తులొచ్చాయి. ఉమ్మడి జిల్లాలో 10,07,090 కార్డులుండగా, లబ్ధిదారుల సంఖ్య 29,84,569గా ఉంది.
Similar News
News October 14, 2025
రూ.20తో రూ.2లక్షల బీమా: కలెక్టర్ ఇలా త్రిపాఠి

వాహనాల ద్వారా స్వల్పకాలిక పనులు చేసే వారందరూ జీవిత బీమా సౌకర్యాన్ని కలిగి ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఇందుకుగాను వివిధ బ్యాంకులు రూ.2 లక్షలతో వివిధ రకాల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయని చెప్పారు. సంవత్సరానికి కేవలం రూ.20 చెల్లిస్తే బీమా వర్తిస్తుందన్నారు. కార్మికులందరికీ ప్రమాద బీమా వర్తింపజేసేందుకు శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
News October 13, 2025
ఇసుక తవ్వకాలపై నివేదిక కోరిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

జిల్లాలోని ఇసుక తవ్వకాలకు సంబంధించి కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను నివేదిక కోరారు. నీటిపారుదల, గనులు, భూగర్భ జల వనరులు, టీఎస్ ఎంఐడీసీ, అటవీ, రెవెన్యూ, ముఖ్య ప్రణాళిక అధికారి శాఖల నుంచి ఇసుక తవ్వకాలపై నివేదికలను అందించాలని ఆదేశించారు. ఆయా శాఖలు సమర్పించిన నివేదికలన్నింటిని పూర్తిస్థాయి జిల్లా సమగ్ర నివేదికగా మార్చి అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.
News October 13, 2025
ఎస్పీ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే.. 35 ఫిర్యాదులు స్వీకరణ

ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రతీ సోమవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో విజయవంతంగా ముగిసింది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ దాదాపు 35 మంది అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను విన్నారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను చేరువ చేయడమే తమ లక్ష్యమని ఎస్పీ తెలిపారు.