News June 18, 2024

నల్గొండ ఎస్పీగా మాజీ ఎమ్మెల్యే అల్లుడు

image

యాంటి నార్కోటిక్‌ బ్యూరో ఇన్‌ఛార్జిగా పని చేస్తున్న శరత్‌చంద్ర పవార్‌‌ను నల్గొండ జిల్లా ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. ఈయన ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ అల్లుడు. 2016 ఐపీఎస్‌ బ్యాచ్‌లో ఎంపికై మొదటిసారి ములుగు జిల్లా ఏటూరునాగారం ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీగా, HYD సెంట్రల్‌ జోన్‌ ఇన్‌ఛార్జిగా పనిచేసిన అనుభవం ఉంది. అటు సూర్యాపేట ఎస్పీగా సన్‌ప్రీత్‌ సింగ్‌ను నియమించింది.

Similar News

News November 20, 2025

NLG: ఎఫ్‌సీఐ డివిజనల్ కార్యాలయం ప్రారంభం

image

నల్గొండ జిల్లాలో నూతనంగా నిర్మించిన ఎఫ్‌సీఐ డివిజనల్ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, FCI ED వనిత శర్మ, MLC శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ధాన్య నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి, పంపిణీని మెరుగుపరచడానికి ఈ కార్యాలయం దోహదపడుతుందని మంత్రులు పేర్కొన్నారు.

News November 20, 2025

NLG: రోడ్లపై ధాన్యం వద్దు.. ప్రమాదాలకు కారణం కావొద్దు: ఎస్పీ

image

నల్గొండ జిల్లాలో రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టి రోడ్డు ప్రమాదాలకు కారణం కావొద్దని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రోడ్లపై ధాన్యం రాశులు, రాళ్లు ఉంచడం వల్ల ముఖ్యంగా రాత్రి సమయాల్లో వాహనదారులకు అవి కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. రైతులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని, ప్రాణ నష్టం జరగకుండా సహకరించాలని ఎస్పీ కోరారు.

News November 20, 2025

NLG: వామ్మో కోతులు

image

జిల్లాలో కోతుల బెడద కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దిగుబడులు గణనీయంగా తగ్గడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. చాలాకాలంగా వానరాలతో అటు రైతులు, ఇటు ప్రజలు సతమతమవుతున్నారు. రోజూ వేలాది కోతులు కూరగాయలు, పండ్ల తోటలు, పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తూ రైతులను ఇబ్బందుల్లో పడేస్తున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి కోతుల బెడద నివారణకు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు.