News June 18, 2024

నల్గొండ ఎస్పీగా మాజీ ఎమ్మెల్యే అల్లుడు

image

యాంటి నార్కోటిక్‌ బ్యూరో ఇన్‌ఛార్జిగా పని చేస్తున్న శరత్‌చంద్ర పవార్‌‌ను నల్గొండ జిల్లా ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. ఈయన ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ అల్లుడు. 2016 ఐపీఎస్‌ బ్యాచ్‌లో ఎంపికై మొదటిసారి ములుగు జిల్లా ఏటూరునాగారం ఏఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీగా, HYD సెంట్రల్‌ జోన్‌ ఇన్‌ఛార్జిగా పనిచేసిన అనుభవం ఉంది. అటు సూర్యాపేట ఎస్పీగా సన్‌ప్రీత్‌ సింగ్‌ను నియమించింది.

Similar News

News November 14, 2025

NLG: చదువే ధ్యేయంగా బాలికలు ముందుకు సాగాలి: కలెక్టర్

image

బాలికలు చదువునే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ముందుకు సాగాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

News November 14, 2025

NLG: చేప పిల్లలు నాసిరకం: మత్స్యకారులు

image

జిల్లాలో చేప పిల్లల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. చెరువులు, కుంటలకు పూర్తిగా నాసిరకం సీడ్‌ వస్తున్నదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 6 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనుండగా.. ఇప్పటివరకు 60 లక్షలకు పైగానే చేప పిల్లలు పంపిణీ చేశారు. జిల్లాలోని ముత్యాలమ్మ చెరువు, కోతకుంట, ఉంగూరుకుంట చెరువులకు పంపిణీ చేసిన చేప పిల్లలు నాసిరకంగా ఉన్నాయని మత్స్యకారులు ఆరోపించారు.

News November 14, 2025

NLG: 17 నుంచి పత్తి కొనుగోలు బంద్

image

సీసీఐ తీరుపై మరోసారి కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులతోపాటు కాటన్ మిల్లులను ఇబ్బందులకు గురిచేసేలా పత్తి కొనుగోళ్లల్లో కఠిన నిబంధనలను సడలించాలన్న విజ్ఞప్తిని సీసీఐ పట్టించుకోకపోవడంతో మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈనెల 17వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రకటించింది.