News September 30, 2024

నల్గొండ: ఏసీబీకి చిక్కిన పశు వైద్యాధికారి

image

చింతపల్లి మండల పశు వైద్యాధికారి జోసఫ్ పాల్ రూ.6,000 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. గేదెల బ్యాంకు లోన్, హెల్త్ సర్టిఫికెట్ కోసం నసర్లపల్లికి చెందిన ఓ రైతు వద్ద రూ.8వేలు డిమాండ్ చేసి రూ.6 వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే 1064 నంబర్ కి ఫోన్ చేయాలని ఉమ్మడి ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపారు.

Similar News

News December 19, 2025

నల్గొండ: ఈనెల 22న మాక్ డ్రిల్: సీఎస్

image

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందస్తు అప్రమత్తతతోనే ప్రాణనష్టాన్ని నివారించగలమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ‘మాక్ ఎక్సర్‌సైజ్’ను విజయవంతం చేయాలని కోరారు.

News December 19, 2025

నల్గొండ : గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

నల్గొండ మండలంలోని చర్లపల్లి గురుకుల కళాశాలలో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్న శివాని అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. మెడ, తల భాగాల్లో తీవ్ర గాయాలతో పడి ఉన్న ఆమెను తోటి విద్యార్థినులు గమనించి వెంటనే పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 19, 2025

క్లెయిమ్ చేయని ఆస్తులపై 20న అవగాహన శిబిరం

image

క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల కోసం డిసెంబర్ 20న నల్గొండ కలెక్టరేట్ కార్యాలయ ఉదయాదిత్య భవనంలో ఉమ్మడి శిబిరం నిర్వహిస్తున్నారు. క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు.. బ్యాంకు శాఖ, భీమా సంస్థ, మ్యూచువల్ ఫండ్ సంస్థ, శిబిరంలోని స్టాక్ బ్రోకరేజీ సంస్థ, ఆన్‌లైన్ ద్వారా స్టాక్ బ్రోకర్‌లలో దేనినైనా సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.