News March 12, 2025
నల్గొండ: గ్రూప్-2లో మనోళ్ల హవా

గ్రూప్-2లో ఉమ్మడి నల్గొండ వాసులు సత్తా చాటారు. కోదాడకు చెందిన వెంకట హరవర్ధన్ రెడ్డి 447.080 మార్కులు పొంది రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. మోత్కూరుకు చెందిన సాయికృష్ణారెడ్డి 422.91, రామన్నపేట మండలం సిరిపురానికి చెందిన సురేశ్ 411.865, పెన్ పహాడ్ మహ్మదాపురానికి చెందిన అన్నదమ్ములు శ్రీరామ్ మధుకు రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు, అతని తమ్ముడు శ్రీరామ్ నవీన్కు 326 ర్యాంకు వచ్చింది.
Similar News
News October 16, 2025
నారాయణపేట: హత్యాయత్నం కేసులో నిందితుడికి రిమాండ్: ఎస్ఐ

నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం మగ్దంపూర్ గ్రామానికి చెందిన రుక్కమూల నరసింహులుపై కత్తితో దాడి చేసిన జంజర్ల నరేశ్(25)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 10వ తేదీన “తన కూతురితో ఎందుకు మాట్లాడుతున్నావు” అని నరసింహులు ప్రశ్నించడంతో ఆగ్రహానికి గురైన నరేశ్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు పట్టుకుని జిల్లా జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్కు పంపినట్లు SI రమేశ్ తెలిపారు.
News October 16, 2025
వనపర్తిలో ఇంటర్ విద్యార్థి అదృశ్యం

వనపర్తిలోని ఓ కాలేజీ విద్యార్థి అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గద్వాల జిల్లాకు చెందిన పోతులపాడు సంజీవ (16) వనపర్తిలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.ఈనెల 10న మధ్యాహ్నం కాలేజీ నుంచి ఆ విద్యార్థి ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు.ఇప్పటివరకు అతడి ఆచూకీ లభించలేదు. దీంతో విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు.
News October 16, 2025
గద్వాల: కరెంట్ షాక్తో మహిళ మృతి

గద్వాల పట్టణంలోని బీసీ కాలనీలో దుర్గమ్మ (30) అనే మహిళ కరెంట్ షాక్తో బుధవారం మృతిచెందిందని స్థానికులు తెలిపారు. భర్త ఎల్లప్పతో కలిసి దుర్గమ్మ గతంలో నంద్యాల నుంచి గద్వాలకు బతుకుదెరువు నిమిత్తం వచ్చిందని చెప్పారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.