News March 12, 2025

నల్గొండ: గ్రూప్-2లో మనోళ్ల హవా

image

గ్రూప్-2లో ఉమ్మడి నల్గొండ వాసులు సత్తా చాటారు. కోదాడకు చెందిన వెంకట హరవర్ధన్ రెడ్డి 447.080 మార్కులు పొంది రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. మోత్కూరుకు చెందిన సాయికృష్ణారెడ్డి 422.91, రామన్నపేట మండలం సిరిపురానికి చెందిన సురేశ్ 411.865, పెన్ పహాడ్ మహ్మదాపురానికి చెందిన అన్నదమ్ములు శ్రీరామ్ మధుకు రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు, అతని తమ్ముడు శ్రీరామ్ నవీన్‌కు 326 ర్యాంకు వచ్చింది.

Similar News

News December 1, 2025

MHBD: నేటి నుంచి కొత్త వైన్ షాపుల ప్రారంభం

image

జిల్లాలో 2025-27 లైసెన్స్ పీరియడ్ కోసం మొత్తం 61 వైన్ షాపులకు డ్రా పద్ధతి ద్వారా అధికారులు లైసెన్సులు కేటాయించారు. ఇందులో మహబూబాబాద్-27, తొర్రూర్-22, గూడూరు-12 ఎక్సైజ్ శాఖ పరిధిలో 61 షాపులు నిర్వహిస్తున్నారు. డ్రాలో ఎంపికైన నూతన నిర్వాహకులకు అధికారులు లైసెన్సులు అందజేయడంతో వారు సోమవారం నుండి కార్యకలాపాలను ప్రారంభించనున్నారు.

News December 1, 2025

మేడారంపై గొంతు విప్పుతారా..!

image

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి WGL నుంచి కడియం కావ్య, బలరాం నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా మేడారం జాతర వచ్చే 2 నెలల్లో జరగనుంది. ఇప్పటికే నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్ల మేర నిధులను కేటాయించింది. మరో పక్క కేంద్రం మేడారంను జాతీయ పండగగా మార్చేందుకు ససేమిరా అంటోంది. దీనిపై ఈ సీజన్లో గొంతు విప్పి అడిగి ఎండగడితే ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉంది.

News December 1, 2025

కర్నూలు: కరెంట్ సమస్యలు ఉన్నాయా?

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ CMD నిర్వహిస్తున్నట్లు APSPDCL ఛైర్మన్&ఎండీ శివశంకర్ తెలిపారు. రాయలసీమ జిల్లాల ప్రజలకు కరెంట్ సమస్యలు ఉంటే సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 89777 16661కు కాల్ చేయాలని సూచించారు. వీటితోపాటు 1912, వాట్సాప్ నంబర్ 91333 31912 ద్వారానూ ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.