News March 12, 2025
నల్గొండ: గ్రూప్-2లో మనోళ్ల హవా

గ్రూప్-2లో ఉమ్మడి నల్గొండ వాసులు సత్తా చాటారు. కోదాడకు చెందిన వెంకట హరవర్ధన్ రెడ్డి 447.080 మార్కులు పొంది రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. మోత్కూరుకు చెందిన సాయికృష్ణారెడ్డి 422.91, రామన్నపేట మండలం సిరిపురానికి చెందిన సురేశ్ 411.865, పెన్ పహాడ్ మహ్మదాపురానికి చెందిన అన్నదమ్ములు శ్రీరామ్ మధుకు రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు, అతని తమ్ముడు శ్రీరామ్ నవీన్కు 326 ర్యాంకు వచ్చింది.
Similar News
News March 27, 2025
డ్రగ్స్ కేసుల్లో No.1గా మారిన ‘అక్షరాస్యుల కేరళ’

అత్యధిక అక్షరాస్యులున్న కేరళను డ్రగ్స్ భూతం వేధిస్తోంది. దాన్ని అంతం చేయడంలో GOVT విఫలమవుతోంది. తాజాగా పంజాబ్ను దాటేసి దేశంలోనే No.1 డ్రగ్స్ ప్రభావిత రాష్ట్రంగా మారింది. 2021లో 5,696గా ఉన్న NDPS కేసులు 2024లో 27,701కి చేరుకున్నాయి. పంజాబ్ (9,025)తో పోలిస్తే ఇవి 3 రెట్లు ఎక్కువ. 2021కి ముందు నాలుగేళ్లలో 37,228 కేసులు నమోదవ్వగా ఆ తర్వాతి నాలుగేళ్లలో ఇవి 87,101కు చేరాయి. ఏకంగా 130% పెరిగాయి.
News March 27, 2025
మోహన్ లాల్ ‘L2:ఎంపురాన్’ మూవీ రివ్యూ

లూసిఫర్ మూవీకి కొనసాగింపుగా తెరకెక్కిన ‘L2:ఎంపురాన్’ థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో PKR వారసుడిగా సీఎం పదవి చేపట్టిన జితిన్ చేసే అవినీతిని హీరో ఎలా అడ్డుకున్నాడనేది స్టోరీ. మోహన్ లాల్, టొవినో థామస్, పృథ్వీరాజ్ మెప్పించారు. సినిమాటోగ్రఫీ, క్లైమాక్స్ బాగున్నాయి. బలహీనమైన స్టోరీ, ఎమోషన్ సీన్లు లేకపోవడం, నిడివి, స్లోగా ఉండటం మైనస్.
WAY2NEWS RATING: 2.5/5.
News March 27, 2025
పోక్సో కేసు నిందితులపై రౌడీ షీట్: హోంమంత్రి అనిత

AP: రాష్ట్రంలో పోక్సో కేసు నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. నేరాలను అదుపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శక్తి యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన 509 CC కెమెరాలను ప్రారంభించిన అనంతరం హోంమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.