News June 22, 2024
నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా

ధరణి సమస్యల పరిష్కారానికి మోక్షం లభించనుంది. ఎన్నికల కోడ్ ముగియడం, జిల్లాలకు కొత్త కలెక్టర్లు రావడంతో పెండింగ్లో ఉన్న ధరణి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా 16,733 దరఖాస్తులు పెండింగ్లో ఉండగా.. సూర్యాపేటలో 7,293, యాదాద్రిలో 8,342 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. వచ్చే నెలాఖరులోగా అన్ని అర్జీలు పరిష్కారం అయ్యేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
Similar News
News October 22, 2025
ధర్వేశిపురంలో ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు.. భక్తుల రద్దీ

కనగల్ మండలం ధర్వేశిపురంలో వెలసిన స్వయంభూ శ్రీ ఎల్లమ్మ అమ్మవారు బుధవారం భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయ పూజారి మల్లాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ వెంకటరెడ్డి, ఈవో నాగిరెడ్డి పాల్గొన్నారు.
News October 22, 2025
NLG: మద్యం దుకాణాలకు 4,629 దరఖాస్తులు

నల్గొండ జిల్లాలో మద్యం దుకాణాలకు మంగళవారం మరో 9 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సంతోష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా.. నేటి వరకు 4,629 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈనెల 23 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
News October 22, 2025
నల్గొండ డీసీసీకి షార్ట్ లిస్టు రెడీ..! పీఠం దక్కేదెవరికో?

నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి నలుగురు పేర్లతో షార్ట్ లిస్ట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. OC గుమ్మల మోహన్ రెడ్డి, SC కొండేటి మల్లయ్య వైపు, BCలు చనగాని దయాకర్ గౌడ్, పున్న కైలాష్ పేర్లు వినిపిస్తున్నాయి. కాగా మరోవైపు నల్గొండ డీసీసీ బీసీకే అని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది. బీసీ అయితే చనగాని, పున్న కైలాష్ నేత అనే చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. దీనిపై మీ కామెంట్..?