News January 28, 2025
నల్గొండ జిల్లాలో 3.20 లక్షల ఎకరాల్లో వరి సాగు

నల్గొండ జిల్లాలో యాసంగి వరి సాగు ఊపందుకుంది. నాన్ ఆయకట్టులో ఇప్పటికే వరి నాట్లు పూర్తి కావచ్చాయి. ఆయకట్టు పరిధిలో వరినాట్లు కొనసాగుతున్నాయి. రైతులంతా సీజన్లో వరి సాగు వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 3.20 లక్షల ఎకరాలలో వరి పంట సాగైనట్లు అధికారుల అంచనా. ఫిబ్రవరి నాటికి జిల్లాలో వరి నాట్ల సాగు పూర్తి కానున్నట్లు వారు పేర్కొంటున్నారు.
Similar News
News February 13, 2025
నల్గొండ: ఎన్నికల బరిలో 22 మంది!

వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఎన్నికల బరిలో 22 అభ్యర్థులు నిలిచారు. ఈ నెల 10వ తేదీతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల పర్వం ముగిసింది. ఈనెల 11న నామినేషన్ల పరిశీలనలో 23అభ్యర్థులకు గాను ఒక అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో 13న నామినేషన్ల ఉపసంహరణ పర్వం సైతం ముగిసింది.
News February 13, 2025
మర్రిగూడ: బైక్ను ఢీకొన్న మినీ వ్యాన్

మర్రిగూడ మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి రహదారిపై రోడ్డుప్రమాదం జరిగింది. బైక్ను మినీ కూరగాయల వ్యాన్ ఢీకొట్టింది. ఈప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 13, 2025
NLG: పెద్దగట్టు జాతరకు సెలవు ప్రకటించాలని వినతి

సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టు శ్రీ లింగమంతులస్వామి వారి జాతర సందర్భంగా సోమవారం జిల్లాలోని విద్యాసంస్థలు, కార్యాలయాలకు ఒకరోజు సెలవు ప్రకటించాలని యాదవ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పరమేశ్ యాదవ్, నేతలతో కలిసి జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని వారు కోరారు.