News March 17, 2025
నల్గొండ: ట్రాక్టర్ టైర్ కింద పడి డ్రైవర్ దుర్మరణం

బోయినపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కడారి వెంకన్న యాదవ్ (48 ) సోమవారం ప్రమాదవశాత్తు ట్రాక్టరు మధ్య టైర్ కింద పడి తీవ్ర గాయాలతో దుర్మరణం చెందాడు. ట్రాక్టర్లో ఇసుక లోడ్ చేసుకుని నల్గొండకు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ ట్రాలీ డోరు లూజు కాగా దానిని సరిచేసి ట్రాక్టరు డ్రైవింగ్ సీట్లోకి ఎక్కుతున్న క్రమంలో కాలుజారి టైరు కింద పడడంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు.
Similar News
News March 18, 2025
GOVT జాబ్ కొట్టిన నల్గొండ అమ్మాయి

టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1,2 ఫలితాల్లో నల్గొండ జిల్లా త్రిపురారం మండలం వస్త్రాంతండా పరిధిలోని నడిపి తండాకు చెందిన మేఘావత్ కవిత రాష్ట్ర స్థాయిలో 329 ర్యాంకు సాధించి ఉద్యోగానికి ఎంపికైంది. కొంతకాలంగా ఎటువంటి కోచింగ్ లేకుండా స్వతహాగా ప్రిపేరై ఉద్యోగం సాధించిన కవిత ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు ఇబ్రహీంపట్నంలోని గిరిజన గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించారు.
News March 18, 2025
నల్గొండ: మరో GOVT జాబ్ కొట్టిన టీచర్

నల్లగొండ రూరల్ మండలం ST కాలనీ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న G.మౌనిక ఇటీవల విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ గ్రేడ్-2 ఫలితాల్లో హాస్టల్ వెల్ఫేర్గా సెలెక్ట్ అయ్యారు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, తోటి ఉపాధ్యాయులు ఉద్యోగం అభినందించారు. ఓవైపు టీచర్ జాబ్ చేసుకుంటూ పట్టుదలతో చదివి హాస్టల్ వెల్ఫేర్గా సెలెక్ట్ అయ్యారని కొనియాడారు.
News March 18, 2025
GOVT జాబ్ కొట్టిన నల్గొండ జిల్లా బిడ్డ

టీజీపీఎస్సీ ఇటీవల వెల్లడించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రానికి చెందిన పొనుగోటి మాధవరావు కుమారుడు హరీశ్ సత్తా చాటారు. 300 మార్కులకు గాను 199.16 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 121, జోన్ స్థాయిలో 37వ ర్యాంక్ సాధించి వార్డెన్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా హరీశ్కు కుటుంబ సభ్యులతో పాటు పలువురు అభినందనలు తెలిపారు.