News March 17, 2025
నల్గొండ: ట్రాక్టర్ టైర్ కింద పడి డ్రైవర్ దుర్మరణం

బోయినపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కడారి వెంకన్న యాదవ్ (48 ) సోమవారం ప్రమాదవశాత్తు ట్రాక్టరు మధ్య టైర్ కింద పడి తీవ్ర గాయాలతో దుర్మరణం చెందాడు. ట్రాక్టర్లో ఇసుక లోడ్ చేసుకుని నల్గొండకు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ ట్రాలీ డోరు లూజు కాగా దానిని సరిచేసి ట్రాక్టరు డ్రైవింగ్ సీట్లోకి ఎక్కుతున్న క్రమంలో కాలుజారి టైరు కింద పడడంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు.
Similar News
News March 18, 2025
నల్గొండ ఎస్పీ కీలక నిర్ణయం

నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేరాలను తగ్గించేందుకు కొత్త ప్రణాళికను రూపొందించారు. అందులో భాగంగా గ్రామానికి ఓ పోలీసు అధికారిని నియమించారు. కాగా వారు మంగళవారం విధుల్లో చేరనున్నారు. గ్రామ పోలీస్ అధికారులు తప్పనిసరిగా వారికి కేటాయించిన గ్రామాలకు వెళ్లాలని, ప్రజలతో మమేకమవ్వాలని ఎస్పీ తెలిపారు. తద్వారా నేరాలను అదుపులో ఉంచొచ్చని చెప్పారు.
News March 18, 2025
నల్గొండ: పేదలకు అందని రేషన్ బియ్యం!

నల్గొండ జిల్లాలో కొన్ని చోట్ల పేదలకు ఇంకా రేషన్ బియ్యం అందలేదు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15 తేదీ వరకు బియ్యం పంపిణీ చేస్తారు. గడువు దాటినా బియ్యం అందకపోవడంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. కాగా జిల్లాలలో 4,66,061 రేషన్ కార్డులుండగా, 994 దుకాణాల ద్వారా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నారు. త్వరగా బియ్యం పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
News March 18, 2025
GOVT జాబ్ కొట్టిన నల్గొండ అమ్మాయి

టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1,2 ఫలితాల్లో నల్గొండ జిల్లా త్రిపురారం మండలం వస్త్రాంతండా పరిధిలోని నడిపి తండాకు చెందిన మేఘావత్ కవిత రాష్ట్ర స్థాయిలో 329 ర్యాంకు సాధించి ఉద్యోగానికి ఎంపికైంది. కొంతకాలంగా ఎటువంటి కోచింగ్ లేకుండా స్వతహాగా ప్రిపేరై ఉద్యోగం సాధించిన కవిత ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకు ఇబ్రహీంపట్నంలోని గిరిజన గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించారు.