News March 9, 2025

నల్గొండ: తండ్రి అంతిమ సంస్కారాలు చేసిన కుమార్తె

image

నల్గొండ జిల్లా నకిరేకల్‌లో సీపీఐ ఎంఎల్ జనశక్తి సీనియర్ నాయకులు చిట్టూరి సోమయ్య అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుమార్తె తెలంగాణ ఉద్యమ సారథి కళాకారిణి పల్స నిర్మల అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సోమయ్యకు ఒక్కరే సంతానం కావడంతో అన్నీ తానై తన తండ్రి అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ విమలక్కతో పాటు కళాకారులు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. సోమయ్య మృతితో నకిరేకల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News March 20, 2025

NLG: ఎంబ్రాయిడరీ వర్క్‌లో మహిళలకు ఉచిత శిక్షణ

image

నల్గొండ శివారులోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు మార్చి 24 నుంచి మగ్గం వర్క్ (ఎంబ్రాయిడెరీ)లో 30 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ డైరెక్టర్ రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత టూల్ కిట్, వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. 18 సం. నుంచి 45 సంవత్సరాలలోపు ఉమ్మడి నల్గొండకు చెందిన వారు అర్హులని, ఆసక్తి గల వారు మార్చి 23 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 20, 2025

MGUలో అభివృద్ధి పనులు సాగేదెలా..?

image

MG యూనివర్సిటీకి ప్రగతి పద్దు కింద ఎలాంటి నిధులివ్వకపోవడంతో యూనివర్శిటీలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు ప్రశ్నార్థకంగా మారేలా ఉన్నాయి. వివిధ పనులను చేపట్టేందుకు, కొత్త కోర్సులను ప్రవేశ పెట్టేందుకు, ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు, భవనాల నిర్మాణం, మౌలికసదుపాయాల కల్పన తదితర పనులకు రూ.309 కోట్లు కావాలని యూనివర్సిటీ ప్రతిపాదించినా పైసా కేటాయించకపోవడం పట్ల విద్యావేత్తలు మండిపడుతున్నారు.

News March 20, 2025

NLG: బడ్జెట్లో జిల్లాకు పెరిగిన ప్రాధాన్యం

image

రాష్ట్ర వార్షిక బడ్జెట్లో జిల్లాకు పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు జరిగింది. జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో కాస్త ఎక్కువ నిధులు కేటాయించింది. డిండి ఎత్తిపోతల పథకానికి, శ్రీశైలం ఎడమ గట్టు కాలువ వంటి ప్రాజెక్టులకు నిధులు పెంచింది. జిల్లాలోని ప్రాజెక్టులకు ప్రగతి పద్ధతి కింద రూ.1,600 కోట్లు కేటాయించడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!