News July 8, 2024

నల్గొండ: నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణాలు

image

నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో విద్యుద్ఘాతంతో ప్రజలు, పశువుల ప్రాణాలు పోతున్నాయి. మేతకు వెళ్లిన పశువులు, పొలం పనికి వెళ్లిన రైతులు కరెంట్ కాటుకు బలైన ఘటనలో ఉమ్మడి జిల్లాలో కోకొల్లలు. కరెంట్ తీగలు కిందికి ఉండడం, కొన్నిచోట్ల కరెంటు తీగలు తెగిపడటంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.  ఉమ్మడి జిల్లాలో జనవరి నుంచి జులై వరకు విద్యుద్ఘాతంతో 81 పశువులు మరణించగా, 31 మంది మనుషులు ప్రాణాలు కోల్పోయారు.

Similar News

News November 28, 2025

నల్గొండ: సోషల్‌ మీడియాపై ఎస్పీ ప్రత్యేక నిఘా

image

గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ సోషల్‌ మీడియా కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర పవార్ తెలిపారు. ​సోషల్‌ మీడియా వేదికగా ఎవరైనా అసత్య ప్రచారం చేసినా, లేక ప్రత్యర్థులపై దుష్ప్రచారం చేసి శాంతి భద్రతలకు భంగం కలిగించాలని చూసినా, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఈ విషయంలో పోలీసులు ఏమాత్రం ఉపేక్షించబోరని ఆయన స్పష్టం చేశారు.

News November 27, 2025

నల్గొండ జిల్లాలో నేటి సమాచారం..

image

నల్గొండ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
దేవరకొండ: నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు
చండూరు: వృథాగా కృష్ణా జలాలు
నల్గొండ: రేపటితో ముగిస్తున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
నల్గొండ: కోడి ధరను దాటేసిన చిక్కుడుకాయ
నల్గొండ: స్థానికంపై ఆ మూడు పార్టీల కన్ను
కట్టంగూరు: అభ్యర్ధులకు ఎస్సై సూచన
కట్టంగూరు: రెండు సార్లు ఆయనే విన్
మునుగోడు: ప్రశ్నించే గొంతుకులను గెలిపించండి

News November 27, 2025

నల్గొండ: తొలి రోజు 421 సర్పంచ్ నామినేషన్లు దాఖలు

image

తొలివిడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నల్గొండ, చండూరు డివిజన్లో మొత్తం 318 గ్రామ పంచాయతీల్లో 421 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసినట్లు డీపీవో తెలిపారు. చండూర్ 29, చిట్యాల 29, గట్టుప్పల్ 10, కనగల్ 44, కట్టంగూరు 23, కేతేపల్లి 31, మర్రిగూడ 21, మునుగోడు 33, నకిరేకల్ 21, నల్గొండ 25, నాంపల్లి 27, నార్కట్పల్లి 47, శాలిగౌరారం 34, తిప్పర్తి 47 సర్పంచ్ నామినేషన్లు దాఖలైనట్లు పేర్కొన్నారు.