News July 8, 2024
నల్గొండ: నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణాలు

నల్గొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాల్లో విద్యుద్ఘాతంతో ప్రజలు, పశువుల ప్రాణాలు పోతున్నాయి. మేతకు వెళ్లిన పశువులు, పొలం పనికి వెళ్లిన రైతులు కరెంట్ కాటుకు బలైన ఘటనలో ఉమ్మడి జిల్లాలో కోకొల్లలు. కరెంట్ తీగలు కిందికి ఉండడం, కొన్నిచోట్ల కరెంటు తీగలు తెగిపడటంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో జనవరి నుంచి జులై వరకు విద్యుద్ఘాతంతో 81 పశువులు మరణించగా, 31 మంది మనుషులు ప్రాణాలు కోల్పోయారు.
Similar News
News February 23, 2026
సీఎం కప్ హాకీ రాష్ట్రస్థాయి విజేతగా నల్గొండ జట్టు

హైదరాబాద్ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో నల్గొండ బాలుర జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్లో నిజామాబాద్ జట్టుపై 2-0 తేడాతో గెలుపొంది ఛాంపియన్గా నిలిచింది. ఈ చరిత్రాత్మక విజయం పట్ల జిల్లా క్రీడల అధికారి అక్బర్ అలీ, హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఇమామ్ కరీం హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారులను అభినందించారు.
News February 23, 2026
నల్గొండ: గణనీయంగా తగ్గిన మాతా శిశు మరణాలు

రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు మాతా శిశువుల ఆరోగ్యానికి రక్షణ కవచంలా మారుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక సదుపాయాలు, మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో గత ఎనిమిదేళ్లుగా జిల్లాలో మరణాల రేటు గణనీయంగా తగ్గుతోంది. 2018-19లో 335 శిశువులు, 14 మంది తల్లులు మరణించగా, 2025 నాటికి ఆ సంఖ్య 72 శిశువులకు, 9 మంది తల్లులకు పడిపోయింది.
News February 23, 2026
NLG: ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు వెనకడుగు..!

నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు నిబంధనలు శాపంగా మారాయి. పెరిగిన నిర్మాణ వ్యయం, ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలతో 3,300 ఇళ్ల మంజూరును ప్రభుత్వం రద్దు చేసింది. కేవలం రూ.5 లక్షల సాయం సరిపోక, బేస్మెంట్ ఖర్చులకే లక్షలు అవుతుండటంతో పేదలు వెనకడుగు వేస్తున్నారు. దీంతో కొత్త లబ్ధిదారుల ఎంపికకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. నిర్మాణ వ్యయం పెంచాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.


