News September 6, 2024

నల్గొండ: నిషేధం ముగిసింది.. సర్పంచ్ ఎన్నికకు సై  

image

గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ఖర్చు వివరాలు అందజేయక నిషేధం బారిన పడిన అప్పటి అభ్యర్థులు ఇప్పుడు పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. వారిపై ఎన్నికల సంఘం విధించిన మూడేళ్ల సమయం ముగిసింది. 2019లో జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరిగాయి. 1097 మందిపై ఎన్నికల్లో పోటీచేయకుండా 2021లో నిషేధం పడింది. 2024 జులైతో వారి నిషేధ కాలం ముగిసి ఊరట లభించినట్లేనని అధికారులు తెలిపారు.

Similar News

News November 29, 2025

హైదరాబాదులో గుండ్లపల్లి మండల వాసి ఆత్మహత్య

image

నిరుద్యోగం, ఆర్థిక సమస్యలతో నల్గొండ(D) గుండ్లపల్లి(M) తవక్లాపూర్‌కు చెందిన ఆంజనేయులు(27) హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోటీ పరీక్షల కోసం 8 నెలల క్రితం LBనగర్‌కు వెళ్లాడు. శుక్రవారం మ.1:10కి బంధువు అనిల్‌కు చనిపోతానని ఫోన్లో చెప్పాడు. విషయాన్ని వెంటనే సోదరుడు అభినందన్‌కు తెలియజేయగా అతను వెళ్లి చూసేసరికి ఉరేసుకొని కనిపించాడు. అతని సోదరుడు ఫిర్యాదు చేశాడని LBనగర్ సీఐ వినోద్ తెలిపారు.

News November 28, 2025

నల్గొండ జిల్లాలో ఇవాళ్టి టాప్ న్యూస్

image

✓మర్రిగూడ: నగదు ఎలా స్వీకరిస్తున్నారు.. ఇలా త్రిపాఠి వాకబు
✓చెర్వుగట్టు హుండీ ఆదాయం లెక్కింపు
✓చండూరు: కుల ధృవీకరణ కోసం పడిగాపులు
✓మిర్యాలగూడ: భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
✓నల్గొండ: కుక్కల స్వైర విహారం.. 22 గొర్రెల మృతి
✓కట్టంగూరు: కాంగ్రెస్‌లో బయటపడ్డ వర్గ విభేదాలు
✓చిట్యాల: అప్పుడు వార్డు మెంబర్.. ఇప్పడు మండలి ఛైర్మన్

News November 28, 2025

దేవరకొండకు సీఎం రేవంత్

image

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ఖరారైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆయన ఎన్నికల ప్రచారానికి విచ్చేయనున్నారు. దీనిలో భాగంగా డిసెంబర్ 6వ తేదీన జిల్లాలోని దేవరకొండకి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా కాంగ్రెస్ నాయకులు సమీక్షించారు.