News March 4, 2025

నల్గొండ: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్: ఎస్పీ.

image

ఈనెల 5 నుంచి 25 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ అన్ని రకాల పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిందని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. నల్గొండ జిల్లాలో 57 పరీక్షా కేంద్రాలలో 28,722 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.

Similar News

News March 5, 2025

నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడు అదృశ్యం

image

నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి గొల్లగూడలో మూడేళ్ల బాలుడు అదృశ్యమైనట్లు పట్టణ టూ టౌన్ ఎస్ఐ నాగరాజు తెలిపారు. పట్టణ ఆయన తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి గొల్లగూడలో మూడేళ్ల బాలుడు అబ్దుల్ అహ్మద్ (అబ్బు) ఆడుకుంటూ తప్పిపోయాడని తెలిపారు. బాబు ఆచూకీ తెలిసినవారు ‌సెల్ నం.8712670171, 8712667671లకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ నాగరాజు పేర్కొన్నారు

News March 5, 2025

నల్గొండ జిల్లాలో 52 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు

image

నల్గొండ జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటి పరిసరాల్లో BNS 163 (144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఉ.9 గంటల నుంచి మ.12 వరకు పరీక్షలు జరుగుతాయి. సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. ఈసారి 5 నిమిషాల గ్రేస్‌ పీరియడ్‌ను అమలులోకి తీసుకొచ్చారు. జిల్లాలో 28,722 మంది పరీక్ష రాయనున్నారు.

News March 5, 2025

నల్గొండ: విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు హాజరు కావాలి: జిల్లా ఎస్పీ

image

రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన.. పరిక్షా కేంద్రాల వద్ద 163 BNSS(144 సెక్షన్) అమల్లో ఉంటుందన్నారు. 57 పరీక్ష కేంద్రాల్లో 28,722 విద్యార్థులు పరీక్షలకు హాజరు కానునట్లు తెలిపారు. ఈ సమయంలో సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలన్నారు.

error: Content is protected !!