News July 12, 2024
నల్గొండ: పీడీఎస్ బియ్యం అమ్మితే.. డీలర్ షిప్ రద్దు

పీడీఎస్ బియ్యంతో అక్రమ వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోదాడ ఆర్టీఓ సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలో రేషన్ డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమ పద్ధతుల్లో విక్రయిస్తే డీలర్షిప్ రద్దు చేస్తామని హెచ్చరించారు. రేషన్ బియ్యం గ్రామాల్లో కొనుగోలు చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News December 3, 2025
నల్గొండ: డీసీసీ ప్రెసిడెంట్గా నియామకపత్రం అందుకున్న పున్న కైలాశ్

నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్గా పున్న కైలాశ్ నేత నియామకం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేతుల మీదుగా మంగళవారం నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
News December 3, 2025
NLG: నేటి నుంచి మూడో విడత నామినేషన్లు

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో విడత నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. రెండో విడత MLG డివిజన్లో నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. మూడో విడత దేవరకొండ డివిజన్కు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 3న ఎన్నికల అధికారి విడుదల చేయనున్నారు. దేవరకొండ డివిజన్లోని 9 మండలాల్లో 269 గ్రామాలకు, 2,206 వార్డులకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
News December 2, 2025
నియామక పత్రం అందుకున్న పున్న కైలాష్ నేత

నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ పున్న కైలాష్ నేత మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కొండేటి మల్లయ్య, టీపీసీసీ జనరల్ సెక్రటరీలు చనగాని దయాకర్, దైద రవీందర్ పాల్గొన్నారు.


