News July 12, 2024

నల్గొండ: పీడీఎస్ బియ్యం అమ్మితే.. డీలర్ షిప్ రద్దు

image

పీడీఎస్ బియ్యంతో అక్రమ వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోదాడ ఆర్టీఓ సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి అన్నారు. కోదాడ పట్టణంలో రేషన్ డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమ పద్ధతుల్లో విక్రయిస్తే డీలర్షిప్ రద్దు చేస్తామని హెచ్చరించారు. రేషన్ బియ్యం గ్రామాల్లో కొనుగోలు చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News December 8, 2025

కేతేపల్లి: మూడుసార్లు సస్పెండ్.. సతీమణికి సర్పంచ్ టికెట్

image

కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామానికి చెందిన చిన్నబొస్క ప్రసాద్ గతంలో పలు కారణాలపై మూడుసార్లు (మొత్తం 18 నెలలు) సర్పంచ్‌ పదవి నుంచి సస్పెండ్‌ అయ్యారు. గ్రామ సభలు పెట్టలేదని, ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఉప సర్పంచ్‌ సంతకం ఫోర్జరీ చేశారని ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఈసారి జనరల్ మహిళకు రిజర్వేషన్ రావడంతో, ప్రసాద్ సతీమణి చిన్నబొస్క శైలజ సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు.

News December 8, 2025

NLG: మాటల తూటాలు.. స్నేహ బంధాలు!

image

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఆయా పార్టీలు వైరం మరిచి ఒకరికొకరు సహకరించుకుంటున్నాయి. చాలా చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండగా.. మరికొన్ని చోట్ల సీపీఎం, బీజేపీ, ఇంకొన్ని చోట్ల బీజేపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. నిన్నటి వరకు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చిన నేతలు ఇప్పుడు స్నేహబంధం చాటుతూ.. కలిసి ఓట్లు అడుగుతుండటంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

News December 8, 2025

కట్టంగూరు: బాండ్‌ పేపర్‌పై హామీ.. నెరవేర్చకుంటే రిజైన్‌..!

image

తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సర్పంచ్‌ పదవికి రాజీనామా చేస్తానని అభ్యర్థిని శ్రీపాద పుష్పలత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రూ.100 బాండ్‌ పేపర్‌పై ఆమె హామీలను లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. తనను గెలిపిస్తే గ్రామంలో మరో అండర్‌పాస్‌ నిర్మాణం కోసం పోరాడతానని, రెండేళ్లలో అండర్‌పాస్‌ సాధించని పక్షంలో రాజీనామా చేస్తానని ప్రజల సమక్షంలో ప్రకటించారు.