News September 5, 2024

నల్గొండ: పెరిగిన ఉల్లి ధరలు

image

మార్కెట్‌‌లో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. వాటిని కొనాలంటేనే సామాన్యుడు వణికి పోతున్నాడు. నిన్నమొన్నటి వరకు కాస్త పరవాలేదు అనుకున్న ఉల్లి ధర ఇప్పడు ఘాటెక్కింది. వారం రోజుల్లోనే ఉల్లి ధరలు 30-50 శాతం వరకు పెంచారు. ఉమ్మడి జిల్లాలో హోల్సేల్ మార్కెట్లలో తెల్ల ఉల్లిగడ్డల ధర రూ.కిలో 70, ఎర్ర ఉల్లిగడ్డలు కిలో రూ.60కు చేరుకున్నాయి. రిటైల్ వ్యాపారులు వాటికి అదనంగా రూ.10 పెంచి విక్రయిస్తున్నారు.

Similar News

News October 30, 2025

NLG: పంట నష్టం.. క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన!

image

మొంథా తుపాన్ కారణంగా ఉమ్మడి జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలను సేకరించేందుకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్నారు. గ్రామాల్లో ఉన్న ఏఈఓల ద్వారా ఉన్నతాధికారులు వివరాలను సేకరిస్తున్నారు. ఏయే గ్రామాల్లో వంట ఎన్ని ఎకరాల్లో వరి పంట నేలకొరిగిందనే విషయాలను తెలుసుకుంటున్నారు. రైతుల వివరాలను, ఎన్ని ఎకరాల్లో నష్టపోయిందో రికార్డుల్లో నమోదు చేసుకుంటున్నారు.

News October 30, 2025

NLG: మోంథా ఎఫెక్ట్… రైళ్ల రద్దు

image

మోంథా తుపాన్ ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. సికింద్రాబాద్ నుంచి NLG మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జన్మభూమి, విశాఖ, ఫలక్ నుమా రైళ్లు బుధవారం కొంత ఆలస్యంగా నడిచాయి. ఇవాళ ఉదయం రావాల్సిన పల్నాడు ఎక్స్ప్రెస్ రద్దయినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

News October 30, 2025

NLG: నిత్య పూజలకు నోచుకోని శివయ్య

image

శాలిగౌరారంలోని శివాలయంలో నిత్యపూజలు జరగకపోవడం పట్ల భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్ గుండా దుర్గయ్య నల్గొండలోని ఎండోమెంట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఆలయ పూజారి రాంబాబు నిత్య పూజలు చేయడానికి రావడం లేదని ఫిర్యాదు చేశారు. నెల రోజుల క్రితం ఎండోమెంట్ ఈవో రుద్రారం వెంకటేశ్వర్లుకు నిత్య పూజ చేస్తానని పెద్దమనుషుల సమక్షంలో రాసిచ్చినప్పటికీ, ఆ తర్వాత కూడా పూజారి రావడం లేదన్నారు.