News March 4, 2025
నల్గొండ: పోలీసులకు ఎస్పీ స్ర్టాంగ్ వార్నింగ్..

నార్కట్పల్లి మండలం అమ్మనబోలు మూసీ పరివాహక ప్రాంతంలో మంగళవారం జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్రమ ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వెయ్యాలని పోలీసులను ఆదేశించారు. అమ్మనబోలులో ఇవాళ నుంచి పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి ప్రతి వాహనం వివరాలు నమోదు చేయాలన్నారు. అక్రమ ఇసుక తరలించేవారికి సహకరించే పోలీసులు, అధికారులపైనా చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు.
Similar News
News December 4, 2025
NLG: రెండు రంగుల్లో బ్యాలెట్ పత్రాలు

సర్పంచ్, వార్డు సభ్యుడికి బ్యాలెట్ పత్రాలు వేర్వేరుగా ఉంటాయి. సర్పంచ్ అభ్యర్థికి గులాబీ రంగు, వార్డు సభ్యుడికి తెలుపు రంగు ఉన్న బ్యాలెట్ పేపర్ను ఎన్నికల అధికారులు సిద్ధం చేస్తున్నారు. నల్గొండ, చండూరు డివిజన్ పరిధిలో 14 మండలాల్లో 318 గ్రామపంచాయతీలో 991 సర్పంచ్ అభ్యర్థులు, 2,870 వార్డుల్లో 7,893 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి విడత పోలింగ్కు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.
News December 4, 2025
శాలౌగారారం: కాంగ్రెస్లో చేరి సర్పంచ్గా ఏకగ్రీవం

SLG సర్పంచి ఏకగ్రీవ ఎన్నిక నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో మొత్తం 13 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో 11మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా చివరికి కాంగ్రెస్, BRS సానుభూతిపరులు ఒక్కొక్కరు మాత్రమే బరిలో నిలిచారు. చివరి క్షణంలో BRS మద్దతుదారు గుజిలాల్ శేఖర్ బాబు కాంగ్రెస్లో చేరి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదృష్టం అంటే ఈయనదే మరి. ఏమంటారు మీరు.
News December 4, 2025
నిర్భయంగా ఓటు వేయండి: ఎస్పీ శరత్ చంద్ర పవార్

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ ఎలక్షన్ కోడ్ను పాటించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు. నార్కట్పల్లి–యల్లారెడ్డిగూడెం గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓటర్లు భయపడకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ శాఖ పూర్తి భద్రత కల్పిస్తుందని చెప్పారు. ఘర్షణలు, ప్రలోభాలు, నగదు పంపిణీపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.


